నటి తెలివితేటలు.. ‘డ్రగ్’ టెస్ట్లో దొరక్కుండా ‘యూరిన్’లో నీళ్లు
శాండిల్వుడ్లో డ్రగ్స్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే పలువురిని సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు
Actress Ragini Dwivedi: శాండిల్వుడ్లో డ్రగ్స్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే పలువురిని సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో నటి రాగిణి ద్వివేది కూడా ఉన్నారు. గత వారం ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు, ఆధారాలు దొరకడంతో రాగిణిని అదుపులోకి తీసుకున్నారు. ఇక ప్రస్తుతం ఆమె రిమాండ్లో ఉండగా., కేసీ జనరల్ ఆసుపత్రిలో ఆమెకు టెస్ట్లు నిర్వహించారు. అయితే ఆ టెస్ట్లో బయటపడకుండా ఉండేందుకు రాగిణి.. తన యూరిన్లో నీళ్లు కలిపింది. ఈ విషయాన్ని దర్యాప్తులోని ఓ అధికారి తెలిపారు. ఆమె యూరిన్లో నీళ్లు కలిపిన విషయాన్ని గుర్తించినట్లు ఆయన వెల్లడించారు. ఇది చాలా సిగ్గు పడాల్సిన చర్య అని ఆయన అన్నారు.
దీంతో మరోసారి ఆమె నుంచి శాంపిల్స్ని సేకరించి పరీక్షించినట్లు తెలుస్తోంది. కాగా మరోవైపు ఆమె కస్టడీని న్యాయస్థానం మరో మూడు రోజులకు పెంచింది. అయితే గత కొన్ని రోజులుగా డ్రగ్స్ వాడుతున్నట్లయితే యూరిన్ టెస్ట్లో అది బయటపడుతుంది. ఆ శాంపిల్లో నీటిని చేర్చడం వలన యూరిన్ టెంపరేచర్ తగ్గి, సాధారణ ఉష్ణోగ్రతగా చూపుతుంది. ఇదిలా ఉంటే ఇదే కేసులో అరెస్ట్ అయిన సంజన సైతం ఆసుపత్రిలో రచ్చ రచ్చ చేసింది. టెస్ట్ చేసే సమయంలో మెడికల్ సిబ్బందికి సహకరించకుండా, పోలీసులతో వాగ్వాదానికి దిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
Read More: