పాపం రాగిణి, ఐటీ భయంతో ఇల్లు అమ్మకానికి ?

శాండల్‌వుడ్‌ డ్రగ్స్‌ వ్యవహారంలో అరెస్టయిన కన్నడ నటి రాగిణి ద్వివేదికి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం  ఆమె బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్‌ జైలులో ఉన్నారు.

పాపం రాగిణి, ఐటీ భయంతో ఇల్లు అమ్మకానికి ?
Follow us

|

Updated on: Sep 16, 2020 | 1:07 PM

శాండల్‌వుడ్‌ డ్రగ్స్‌ వ్యవహారంలో అరెస్టయిన కన్నడ నటి రాగిణి ద్వివేదికి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం  ఆమె బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్‌ జైలులో ఉన్నారు.  ఇప్పుడు ఆమెకు ఐటీ శాఖ నుంచి భయం మొదలైనట్టు సోషల్ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి.  ఐటీ దాడులు, జప్తుల భయంతో ఆమె ఆస్తులను అమ్మకానికి పెట్టినట్టు ఆ వార్తల సారాంశం. తాను ఎంతో ఇష్టపడి కొనుక్కున్న యలహంక లేఅవుట్‌లోని ఇంటిని కూడా ఒక ప్రైవేట్ వెబ్‌సైట్‌లో  అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తోంది. అయితే, దానిని కొనుగోలు చేసేందుకు ఎవరూ ఇంట్రస్ట్ చూపించడం లేదని సమాచారం. 

Ragini Dwivedi: ರಾಗಿಣಿ ದ್ವಿವೇದಿ ಖರೀದಿಸಿದ್ದ ಮನೆಯನ್ನ ಮಾರಾಟಕ್ಕಿಟ್ಟ ಅಪ್ಪ

రాగిణితో పాటు 14 మంది నిందితులపై నార్కోటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రాపిక్‌ సబ్‌స్టాన్సెస్‌ చట్టం కింద కేసులు నమోదు చేయడంతో ఇప్పట్లో బెయిల్‌ దొరకటం కష్టమని సమాచారం. మరో నటి సంజనను విచారణకు సహకరించటంలేదని సీసీబీ నివేదించింది. ఈ క్రమంలో మరో 2 రోజుల పాటు ఆమెను కస్టడీకి అనుమతించడంతో మంగళ, బుధవారాలు విచారించనున్నారు. నిందితులకు కేసీ జనరల్‌ ఆస్పత్రిలో కరోనా ‌ టెస్టులను, ఇతర వైద్య పరీక్షలను చేయించారు. రాగిణి, సంజనలకు కరోనా నెగిటివ్‌గా నిర్దారణ అయ్యింది.

Also Read :

విచారణకు పిలిస్తే, మాజీ రౌడీషీటర్ ఆగమాగం

చుక్కలనంటిన టమాట ధరలు, కేజీ ఎంతంటే ?

ఎస్సై పేరిట ఫేక్ ఫేస్ బుక్ అకౌంట్..ఇక చూస్కోండి !