రఫేల్ జెట్ విమానాలొస్తున్నాయ్.. రాజ్ నాథ్ సింగ్
కరోనా వైరస్ ప్రబలంగా ఉన్నప్పటికీ,, మనకు రఫేల్ జెట్ విమానాలను సకాలంలో అందజేస్తామని ఫ్రాన్స్ ప్రకటించిందని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు. ఆ దేశ రక్షణ శాఖ మంత్రి..
కరోనా వైరస్ ప్రబలంగా ఉన్నప్పటికీ,, మనకు రఫేల్ జెట్ విమానాలను సకాలంలో అందజేస్తామని ఫ్రాన్స్ ప్రకటించిందని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు. ఆ దేశ రక్షణ శాఖ మంత్రి ఫ్లారెన్స్ పార్లెతో తాను ఫోన్ లో మాట్లాడానని, ఈ విమానాలను పంపడానికి కొంతవరకు కరోనా క్రైసిస్ కారణమని ఆయన అభిప్రాయపడ్డారని రాజ్ నాథ్ చెప్పారు. కరోనా కారణంగా తలెత్తిన పరిస్థితితో సహా ప్రాంతీయ భద్రత తదితర అంశాలపై ఉభయ దేశాలూ సహకరించుకోవాలని నిర్ణయించామని ఆయన పేర్కొన్నారు. 4 రఫేల్ విమానాలు గత మే నెలలోనే ఇండియాకు చేరవలసి ఉందని, కానీ ఇవి జులై నెలాఖరుకు మనకు చేరుతాయని ఆయన వివరించారు. పాకిస్తాన్ నుంచి ముప్పు ఎదుర్కొంటున్న దృష్ట్యా.. భారత వైమానిక దళం ఈ విమానాలను వచ్ఛే ఏడాది ఫిబ్రవరి నాటికి పూర్తి స్థాయిలో వినియోగించుకునే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఫ్రాన్స్ నుంచి ఇండియా రూ. 59 వేల కోట్లతో 36 రఫేల్ జెట్ ప్లేన్లను కొనుగోలు చేసింది.