‘రీల్’ భార్యాభర్తలుగా శరత్కుమార్, రాధిక
చెన్నై: మణిరత్నం వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసిన ధనశేఖరన్ తాజాగా ఓ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ఈ మూవీకి ‘వానం కొట్టట్టుం’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇందులో విక్రంప్రభు కథానాయకుడిగా నటిస్తుండగా ఐశ్వర్యా రాజేష్ అతని సరసన ఆడిపాడబోతుంది. అయితే ఇందులో ‘రియల్’ భార్యాభర్తలు ‘రీల్’ భార్యభర్తలుగా నటించబోతున్నారు. వారెవరో కాదు తమిళ సీనియర్ స్టార్ కపుల్ రాధిక, శరత్కుమార్. వీరిద్దరూ మూవీలో ఇంపార్టెంట్ పాత్రలు పోషించబోతున్నట్టు తెలుస్తుంది ఇతర నటీనటుల ఎంపిక పనులు జరుగుతున్నాయి. […]
చెన్నై: మణిరత్నం వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసిన ధనశేఖరన్ తాజాగా ఓ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ఈ మూవీకి ‘వానం కొట్టట్టుం’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇందులో విక్రంప్రభు కథానాయకుడిగా నటిస్తుండగా ఐశ్వర్యా రాజేష్ అతని సరసన ఆడిపాడబోతుంది. అయితే ఇందులో ‘రియల్’ భార్యాభర్తలు ‘రీల్’ భార్యభర్తలుగా నటించబోతున్నారు. వారెవరో కాదు తమిళ సీనియర్ స్టార్ కపుల్ రాధిక, శరత్కుమార్. వీరిద్దరూ మూవీలో ఇంపార్టెంట్ పాత్రలు పోషించబోతున్నట్టు తెలుస్తుంది ఇతర నటీనటుల ఎంపిక పనులు జరుగుతున్నాయి. మణిరత్నానికి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. అయితే ఈ బ్యానర్లో ఇప్పటివరకు మణరత్నం తన సొంత సినిమాలను మాత్రమే నిర్మిస్తారు. కానీ తొలిసారిగా తన శిష్యుడి సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. జూన్లో షూటింగ్ ఆరంభించనున్న ఈ చిత్రం ఆడియెన్స్ను ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి.