‘మహాసముద్రం’లో ఛాన్స్ కొట్టేసిన బబ్లీ బ్యూటీ..!

ఆర్‌ఎక్స్‌ 100 ఫేమ్‌ అజయ్‌ భూపతి తెరకెక్కించనున్న చిత్రం 'మహాసముద్రం'. శర్వానంద్ ఇందులో హీరోగా నటిస్తుండగా.. సిద్ధార్థ్ విలన్‌గా కనిపించబోతున్నారు.

'మహాసముద్రం'లో ఛాన్స్ కొట్టేసిన బబ్లీ బ్యూటీ..!
Follow us

| Edited By:

Updated on: Jun 29, 2020 | 11:19 PM

ఆర్‌ఎక్స్‌ 100 ఫేమ్‌ అజయ్‌ భూపతి తెరకెక్కించనున్న చిత్రం ‘మహాసముద్రం’. శర్వానంద్ ఇందులో హీరోగా నటిస్తుండగా.. సిద్ధార్థ్ విలన్‌గా కనిపించబోతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే ఈ మూవీ సెట్స్‌ మీదకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇందులో ఒక హీరోయిన్‌గా సాయి పల్లవి ఫైనల్ అయినట్లు ఆ మధ్యన వార్తలు రాగా.. తాజా సమాచారం ప్రకారం మరో హీరోయిన్‌గా బబ్లీ బ్యూటీ రాశిఖన్నా ఈ మూవీకి ఓకే చెప్పినట్లు సమాచారం. ఇందులోని పాత్ర నచ్చేయడంతో రాశిఖన్నా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేసినట్లు టాక్‌. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

కాగా గతేడాది రెండు మంచి హిట్లను ఖాతాలో వేసుకున్న రాశిఖన్నా.. ఈ ఏడాది వరల్డ్ ఫేమస్ లవర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. ఇక ప్రస్తుతం రాశిఖన్నా తమిళంలో అర్మణై 3, అరువా చిత్రాల్లో నటిస్తోంది.