బిగ్ బాస్: ఫస్ట్ అలీ రెజా, సెకండ్ వరుణ్ ఔట్..నెక్ట్స్ ఎవరంటే..?

బిగ్‌బాస్‌ సీజన్‌ 3 చివరిదశకు చేరుకుంది. మూడో సీజన్‌ విజేత ఎవరో అతికొద్ది సమయంలో తేలిపోనుంది. నిర్విరామంగా  106 రోజుల పాటు  17 మంది కంటెస్టెంట్స్‌తో పోటాపోటిగా  సాగిన ఈ ఆటలో ఐదుగురు మాత్రమే ఫైనల్‌కి చేరారు. ఈ ఐదురుగులో ఒక్కరు మాత్రమే టైటిల్‌ను ముద్దాడనున్నారు. ఓటింగ్ లిస్ట్‌ ప్రామాణికంగా అలీ రెజా ఫస్ట్ ఎలిమినేట్ అయ్యాడు. బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి అతిథులుగా వెళ్లి సందడి చేసిన మారుతి, హీరోయిన్‌ రాశీ ఖన్నా ఈ విషయాన్ని రివీల్‌ చేశారు. […]

బిగ్ బాస్: ఫస్ట్ అలీ రెజా, సెకండ్ వరుణ్ ఔట్..నెక్ట్స్ ఎవరంటే..?
Follow us

|

Updated on: Nov 03, 2019 | 9:14 PM

బిగ్‌బాస్‌ సీజన్‌ 3 చివరిదశకు చేరుకుంది. మూడో సీజన్‌ విజేత ఎవరో అతికొద్ది సమయంలో తేలిపోనుంది. నిర్విరామంగా  106 రోజుల పాటు  17 మంది కంటెస్టెంట్స్‌తో పోటాపోటిగా  సాగిన ఈ ఆటలో ఐదుగురు మాత్రమే ఫైనల్‌కి చేరారు. ఈ ఐదురుగులో ఒక్కరు మాత్రమే టైటిల్‌ను ముద్దాడనున్నారు. ఓటింగ్ లిస్ట్‌ ప్రామాణికంగా అలీ రెజా ఫస్ట్ ఎలిమినేట్ అయ్యాడు. బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి అతిథులుగా వెళ్లి సందడి చేసిన మారుతి, హీరోయిన్‌ రాశీ ఖన్నా ఈ విషయాన్ని రివీల్‌ చేశారు. టాప్‌-5లో ఉన్న కంటెస్టెంట్లలో మొదట ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్‌గా అలీ రెజా పేరును వారు తెలిపడంతో అతడు బయటకు వచ్చేశాడు.

దీంతో రాహుల్‌ సిప్లి గంజ్‌, శ్రీముఖి, బాబా భాస్కర్‌, వరుణ్‌ సందేశ్‌లు మాత్రమే మిగిలారు. ఈ నేపథ్యంలో ఇంటిలో ఉన్న నలుగురు సభ్యులకు హోస్ట్ నాగ్ ఫస్ట్ రూ.10లక్షలు ఆఫర్‌ చేసి.. ఎవరైనా వాటిని తీసుకుని వెళ్లిపోవచ్చని చెప్పాడు. కానీ ఎవరూ ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇంటిలో ఉన్న కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి సలహా తీసుకున్నా, వారు కూడా మనీ తీసుకోమని చెప్పలేదు. దీంతో నాగ్ ‘ప్లాన్‌ బి’ అమలు చేశాడు. ఆ రూ.10లక్షలకు మరో రూ.10లక్షలు కలిపి, మొత్తం రూ.20లక్షలు ఆఫర్‌ చేశారు. అప్పుడు కూడా ఏ కంటెస్టెంట్ వెళ్లేందుకు సిద్దంగా లేకపోవడంతో… ప్లాన్‌-సి అమలు చేయాల్సి వచ్చింది. హీరోయిన్ కేథరిన్‌ ప్రత్యేక కవర్‌తో వచ్చి ఎలిమినేట్‌ అయ్యేవారి పేరు చెప్పే ముందు మరోసారి రూ.20లక్షలు ఆఫర్‌ చేశారు. అయినా హౌజ్ మిగిలి ఉన్న అందరూ గెలుస్తామన్న కాన్పిడెన్స్ చూపించడంతో.. చివరకు వరుణ్‌ సందేశ్‌ ఎలిమినేట్‌ అయినట్లు ప్రకటించారు. బయటకు వచ్చిన వరుణ్‌ సందేశ్‌ మాట్లాడుతూ.. ‘బిగ్‌బాస్‌’లో తన జర్నీ గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యాడు.

తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల తేదీ ఇదే
తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల తేదీ ఇదే
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్