రోగికి పాజిటివ్..క్వారంటైన్ సెంటర్ మూసివేత..!
గర్ల్స్ కాలేజీని ఇటీవలే క్వారంటైన్ సెంటర్ గా మార్చారు. అయితే అందులో ఉన్న వ్యక్తికి పాజిటివ్ గా తేలడంతో క్వారంటైన్ సెంటర్
ఇక్కడ అక్కడా అని కాదు..కరోనా ఎక్కడికైనా పాకేస్తుంది. గుడి, బడి, ప్రభుత్వ, ప్రైవేటు అన్ని చోట్లకు కరోనా వైరస్ వ్యాపిస్తోంది. కరోనా రక్షణ కవచాలుగా పనిచేస్తున్న అనేక మంది వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, సినీ, రాజకీయ ప్రముఖులు అనేక మందిని కరోనా వెంటాడుతోంది. దీంతో ఏ రూపంలో కోవిడ్ వైరస్ ఎటాక్ చేస్తుందో తెలియక ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. అయితే, ఓ క్వారంటైన్ సెంటర్లో ఉన్న రోగికి కరోనా పాజిటివ్గా తేలటంతో క్వారంటైన్ సెంటర్నే మూసివేశారు అక్కడి అధికారులు. వివరాల్లోకి వెళితే…
కరోనా నేపథ్యంలో మణిపూర్ లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్ లో ఉన్న ఓ రోగికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో క్వారంటైన్ సెంటర్ ను మూసివేసిన అధికారులు గేట్లకు తాళాలు వేశారు. మణిపూర్ ఇంఫాల్ ఈస్ట్ జిల్లాలోని జామియా గలినా అజిజ్ గర్ల్స్ కాలేజీని ఇటీవలే క్వారంటైన్ సెంటర్ గా మార్చారు. అయితే అందులో ఉన్న వ్యక్తికి పాజిటివ్ గా తేలడంతో క్వారంటైన్ సెంటర్ ఉన్న ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్ గా నిర్దారించారు. క్వారంటైన్ కేంద్రం నిర్వహిస్తోన్న భవనాన్ని పూర్తిగా మూసివేశారు. పాజిటివ్ వచ్చిన 31 ఏళ్ల వ్యక్తిని జవహర్ నెహ్రూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు అధికారులు. ఇంఫాల్ ఈస్ట్ జిల్లా డిప్యూటీ కమిషనర్ రంగితబలి వైఖోమ్ ఈ మేరకు వివరాలను వెల్లడించారు.