‘పుష్ప’ బ్యాచ్…జానపదంతో దుమ్మురేపనున్నారు..!
సుకుమార్, అల్లు అర్జున్…వీరిద్దరి జోడికి రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ జోడైతే ఆ కాంబినేషన్ మాములుగా ఉండదు. సినిమా మ్యూజికల్ హిట్ గ్యారెంటీ. ఆ తర్వాత ఇండస్ట్రీ రికార్డ్స్ గురించి బన్నీ-సుక్కు చూసుకుంటారు. ప్రేక్షకుల్లో ఈ ముగ్గురు కాంబినేషన్కు ఓ రేంజ్ బెంచ్ మార్క్ ఉంది. ‘ఆర్య’తో మొదలైన వీరి ప్రయాణం ‘ఆర్య 2’తో మరోసారి దుమ్మురేపింది. ఇప్పుడు ఈ ముగ్గురు ‘పుష్ప’తో హ్యాట్రిక్కు సిద్ధమయ్యారు. ఇవన్నీ పక్కన బెడితే సుకుమార్- బన్నీ చిత్రానికి దేవీ సంగీతమంటే […]
సుకుమార్, అల్లు అర్జున్…వీరిద్దరి జోడికి రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ జోడైతే ఆ కాంబినేషన్ మాములుగా ఉండదు. సినిమా మ్యూజికల్ హిట్ గ్యారెంటీ. ఆ తర్వాత ఇండస్ట్రీ రికార్డ్స్ గురించి బన్నీ-సుక్కు చూసుకుంటారు. ప్రేక్షకుల్లో ఈ ముగ్గురు కాంబినేషన్కు ఓ రేంజ్ బెంచ్ మార్క్ ఉంది. ‘ఆర్య’తో మొదలైన వీరి ప్రయాణం ‘ఆర్య 2’తో మరోసారి దుమ్మురేపింది. ఇప్పుడు ఈ ముగ్గురు ‘పుష్ప’తో హ్యాట్రిక్కు సిద్ధమయ్యారు. ఇవన్నీ పక్కన బెడితే సుకుమార్- బన్నీ చిత్రానికి దేవీ సంగీతమంటే స్పెషల్ సాంగ్ ఉండాల్సిందే. ఈ మూవీలో కూడా ఓ ఐటెమ్ సాంగ్ ఉందని, అందులో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ మెరవబోతుందని టాక్.
తాజాగా సినిమా నుంచి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే.. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో ఈ సినిమా ఉండనున్న విషయం తెలిసిందే. అది కూడా రెడ్ శాండిల్ ఎక్కువగా పెరిగే చిత్తూరు అడవుల్లోనే ఎక్కువ చిత్రీకరణ జరగనున్నట్లు తెలుస్తోంది. అందుకే అక్కడి పరిస్థితుల్ని, ప్రజల జీవన విధానాన్ని తెరపై చూపించాలని దర్శకుడు సుకుమార్ ఆరాటపడుతున్నట్టు వినికిడి. దానికి తగ్గట్లు జానపదాల్ని వినిపించేందుకు మూవీ యూనిట్ సమాయత్తమవుతుందని తెలుస్తోంది. కథలో భాగంగా గిరిజనుల జానపదాల గీతాన్ని వెండితెరపై చూపించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. మాములుగానే ఫోక్ సాంగ్స్ కి అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చే దేవీ..ఈ చిత్రంలో ఎటువంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.