పురుషోత్తం ప్రియదాస్ స్వామీజీ ఇకలేరు
గుజరాత్లోని మణినగర్ కేంద్రంగా నడుస్తున్న ఆధ్యాత్మక సంస్థ అయిన శ్రీ స్వామినారాయణ్ గడీ సంస్థాన్ వ్యవస్థాపకుడు పురుషోత్తం ప్రియదాస్ మహారాజ్ స్వామీజీ పరమపదించారు. ఆయన వయస్సు 78 సంవత్సరాలు. గత..
గుజరాత్లోని మణినగర్ కేంద్రంగా నడుస్తున్న ఆధ్యాత్మక సంస్థ అయిన శ్రీ స్వామినారాయణ్ గడీ సంస్థాన్ వ్యవస్థాపకుడు పురుషోత్తం ప్రియదాస్ మహారాజ్ స్వామీజీ పరమపదించారు. ఆయన వయస్సు 78 సంవత్సరాలు. గత కొద్ది రోజులుగా ఆయన అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలోనే ఆయన గురువారం నాడు మరణించారు. స్వామీజీ మరణంపట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కూడా సంతాపాన్ని తెలిపారు. స్వామి నారాయణ్ బోధనలతో గుర్తింపు పొందిన గడీ సంస్థాన్ ఆధ్వర్యంలో స్వామీజీ మహిళా సాధికారత, విద్య గురించి చెబుతుండే వారు. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా గుర్తు చేశారు.
Acharya Shree Purushottampriyadasji Swamishree Maharaj was blessed with immense wisdom. His emphasis on community service, education and women empowerment will always be remembered. I will never forget my many interactions with him. Om Shanti.
— Narendra Modi (@narendramodi) July 16, 2020