చెర్రీతో పూరీ పాన్ ఇండియా మూవీ!
మెగా పవర్స్టార్ రామ్ చరణ్ను టాలీవుడ్కి పరిచయం చేసింది డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ అన్న విషయం అందరికీ తెలిసిందే.
Puri next with Cherry: మెగా పవర్స్టార్ రామ్ చరణ్ను టాలీవుడ్కి పరిచయం చేసింది డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా తరువాత వీరిద్దరి కాంబినేషన్లో మరో చిత్రం రాలేదు. ఓ వైపు చెర్రీ ఆచితూచి సినిమాలు చేస్తుండటం.. మరోవైపు పూరీ ఎప్పటిలాగే స్పీడుగా దూసుకుపోతుండటంతో.. వీరి కాంబినేషన్ ఇప్పటివరకు సెట్ అవ్వలేకపోయింది.
అయితే టాలీవుడ్ తాజా సమాచారం ప్రకారం.. ఈ ఇద్దరి కాంబోలో రెండో చిత్రం రాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో పూరీ పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఇంకా చాలానే ఉంది. అయితే లాక్డౌన్ వేళ ఇంటికే పరిమితమైన పూరీ, చాలా కథలను రాసుకున్నారట. అందులో ఒకటి చెర్రీతో తీయాలని ఆయన ప్లాన్ చేస్తున్నారట. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది మధ్యలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కాగా ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్లో నటిస్తోన్న చెర్రీ.. చిరు హీరోగా కొరటాల తెరకెక్కిస్తోన్న ఆచార్యలోనూ కనిపించబోతున్న విషయం తెలిసిందే.
Read This Story Also: అన్నీ సిద్ధంగా ఉన్నాయి.. నువ్వు తప్ప: కన్నీళ్లు పెట్టిస్తోన్న సుశాంత్ సోదరి పోస్ట్