గురు గ్రంథ్ సాహిబ్ కేసు.. ఎఫ్ఐఆర్ లో నిందితునిగా రామ్ రహీమ్ సింగ్
గురు గ్రంథ్ సాహిబ్ 'అపవిత్రం ' కేసులో డేరా బాబా సచ్చా సౌదా చీఫ్ రామ్ రహీం సింగ్ ని నిందితునిగా పోలీసులు తమ ఎఫ్ఐఆర్ లో చేర్చారు. ఇతని మరో ఏడుగురుసహచరుల..
గురు గ్రంథ్ సాహిబ్ ‘అపవిత్రం ‘ కేసులో డేరా బాబా సచ్చా సౌదా చీఫ్ రామ్ రహీం సింగ్ ని నిందితునిగా పోలీసులు తమ ఎఫ్ఐఆర్ లో చేర్చారు. ఇతని మరో ఏడుగురుసహచరుల పేర్లను కూడా వారు ప్రస్తావించారు. జులై 4 న ఫరీద్ కోట్ జిల్లాకు చెందిన ఈ ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. 2015 జూన్ 1 న ఈ జిల్లాలోని గురుద్వారా నుంచి గురు గ్రంథ్ సాహిబ్ ని చోరీ చేశారన్న ఆరోపణలు వీరిపై ఉన్నాయి. నాడు ఈ ఘటనలో పెద్దఎత్తున పోలీసు కాల్పులు, అల్లర్లు జరిగాయి. ఇద్దరు ఆందోళనకారులు మరణించారు. పంజాబ్ ప్రభుత్వం రెండు సిట్ లను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఈ కేసుపై దర్యాప్తు జరుగుతూ వచ్చింది. కాగా ప్రస్తుతం జైల్లో ఉన్న గుర్మీత్ రామ్ రహీం సింగ్ ని ఇన్నాళ్లకు ఈ కేసులో నిందితునిగా చేర్చడం విశేషం.