Big Boss Telugu3: బిగ్ బాస్కి వార్నింగ్ ఇచ్చిన పునర్నవి.. ఇదేం టాస్క్ అంటూ ఫైర్..
బిగ్ బాస్ 3 రోజురోజుకి ఆసక్తిగా సాగుతోంది. ఊహించని విధంగా ఎలిమినేషన్స్ జరుగుతున్నాయి. థ్రిల్లింగ్ టాస్క్లతో బిగ్ బాస్ హౌస్ మేట్స్ను ఓ ఆట ఆడుకుంటున్నారు. వారిమధ్య గొడవలు పెడుతున్నారు. తాజాగా నిన్నటి ఎపిసోడ్లో ఇంటి సభ్యులకి ఇంట్లో దెయ్యం నాకేం భయం అనే టాస్క్ను ఇచ్చారు బిగ్ బాస్. ఇందులో బాబా భాస్కర్, హిమజ, రాహుల్, శిల్ప, వితికాలు దెయ్యాలుగా ఉంటారు. ఇక మనుషులుగా వరుణ్, శ్రీముఖి, పునర్నవి, రవి, మహేష్లు ఉంటారు. అయితే దెయ్యాలుగా […]
బిగ్ బాస్ 3 రోజురోజుకి ఆసక్తిగా సాగుతోంది. ఊహించని విధంగా ఎలిమినేషన్స్ జరుగుతున్నాయి. థ్రిల్లింగ్ టాస్క్లతో బిగ్ బాస్ హౌస్ మేట్స్ను ఓ ఆట ఆడుకుంటున్నారు. వారిమధ్య గొడవలు పెడుతున్నారు. తాజాగా నిన్నటి ఎపిసోడ్లో ఇంటి సభ్యులకి ఇంట్లో దెయ్యం నాకేం భయం అనే టాస్క్ను ఇచ్చారు బిగ్ బాస్. ఇందులో బాబా భాస్కర్, హిమజ, రాహుల్, శిల్ప, వితికాలు దెయ్యాలుగా ఉంటారు. ఇక మనుషులుగా వరుణ్, శ్రీముఖి, పునర్నవి, రవి, మహేష్లు ఉంటారు. అయితే దెయ్యాలుగా ఉన్నవారు మనుషులకు విసుగు తెప్పిస్తూ ఉండాలి.
టాస్క్లో భాగంగా దెయ్యాలు తెగ అల్లరి చేశారు. కేకలు పెడుతూ వికృతంగా ప్రవర్తించారు. వితికాకి ఇచ్చిన టాస్క్లో భాగంగా ఆమె .. వరుణ్కి మూడు ముద్దులు పెట్టి బాత్రూం మిర్రర్పై వరుణ్ గోస్ట్ రాస్తుంది. దీంతో వితికా మాములు మనిషిగా మారుతుంది. వరుణ్ చనిపోయి దెయ్యంగా మారుతాడు. ఇక హిమజ .. శ్రీముఖి తలపై కోడిగుడ్డు కొట్టడం.. శిల్పా చక్రవర్తి.. పునర్నవిని పూల్లోకి తోసేయడంతో హిమజ, శిల్పాలు మనుషులుగా మారి శ్రీముఖి, పునర్నవి దెయ్యం అవతారం ఎత్తుతారు. అయితే టాస్క్లో ఉన్నంతసేపు ఎవరూ గొడవలు పడకూడదని.. కామ్గా ఉండాలని బిగ్ బాస్ హెచ్చరించారు. కాగా, టాస్క్ అయినంత సేపు కామ్ గా ఉన్న పునర్నవి ఆ తర్వాత ఫైర్ అయింది. ఇలాంటి గేమ్స్ ఎలా ఇస్తారు అంటూ.. బిగ్ బాస్ ఇది బుల్ షిట్ టాస్క్ అని ఆగ్రహం వ్యక్తం చేసింది.