ప్రముఖ సింగర్ల పై ఫృథ్వీ హాట్ కామెంట్స్..
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడిచే భక్తి చానల్ ఎస్వీబీసీకి చైర్మన్ గా వ్యవహరిస్తున్న నటుడు పృథ్వి మరోసారి ప్రముఖ సింగర్ల పై సంచలన కామెంట్స్ చేశారు. ఎస్వీబీపీలో పాటలు పాడటానికి వివిధ కచేరీలు, కార్యక్రమాల్లో పాల్గొనడానికి రూ.2 లక్షలు పారితోషికం కావాలని టాలీవుడ్ నుంచి డిమాండ్లు వస్తున్నాయన్నారు. తమకు కీరవాణి, సునీత లాంటి వాళ్లు అవసరం లేదని.. స్థానికంగానే అద్భుతమైన గాయనీలు ఉన్నారని పృథ్వీ స్పష్టం చేశారు. స్థానిక కళాకారులతోనే మంచి కార్యక్రమాలు నిర్వహిస్తానని చెప్పారు. […]
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడిచే భక్తి చానల్ ఎస్వీబీసీకి చైర్మన్ గా వ్యవహరిస్తున్న నటుడు పృథ్వి మరోసారి ప్రముఖ సింగర్ల పై సంచలన కామెంట్స్ చేశారు. ఎస్వీబీపీలో పాటలు పాడటానికి వివిధ కచేరీలు, కార్యక్రమాల్లో పాల్గొనడానికి రూ.2 లక్షలు పారితోషికం కావాలని టాలీవుడ్ నుంచి డిమాండ్లు వస్తున్నాయన్నారు. తమకు కీరవాణి, సునీత లాంటి వాళ్లు అవసరం లేదని.. స్థానికంగానే అద్భుతమైన గాయనీలు ఉన్నారని పృథ్వీ స్పష్టం చేశారు.
స్థానిక కళాకారులతోనే మంచి కార్యక్రమాలు నిర్వహిస్తానని చెప్పారు. అంతేకాదు 20 రోజులు తిరుమలలోనే ఉండి స్వామికి సేవ చేస్తానని ఆయన అన్నారు. ఛానల్లో ఏదైనా కొత్తగా చేయాలనే ఆలోచన ఉందని.. ఎస్వీబీసీలోని ఉద్యోగులకు భద్రత సౌకర్యాలు, సరికొత్త టెక్నాలజీతో ఛానల్ రూపురేఖలు మారుస్తానని అన్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయని త్వరలోనే అమలు పరుస్తామని పృథ్వీ ఈ సందర్భంగా తెలిపారు.
సినిమా షూటింగ్లలో పాల్గొంటే.. ఒక్క షోకి కూడా మనీ తీసుకోకుండా ఉండనని.. తిరుమల స్వామి కార్యంలో మాత్రం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఎస్వీబీసీలో సేవ చేస్తున్నానని ఆయన చెప్పుకొచ్చారు. విధి నిర్వహణలో తాను టీటీడీ వాహనాలు కూడా వాడడం లేదని క్లారిటీ ఇచ్చారు. ఎస్వీబీసీలో గతంలో జరిగిన అక్రమాలపై సీఎం కార్యాలయానికి ఫైల్ పంపిస్తానని.. టీడీపీ హయాంలో జరిగిన ప్రతి పనికి సంబంధించి రిపోర్టులు బయటకు తీస్తామన్నారు.