మేం నచ్చకపోతే.. మోదీకే ఓటు వేయాల్సింది : కుమారస్వామి
కర్నాటక ముఖ్యమంత్రి కుమార స్వామికి నిరసనల సెగ తగిలింది. రాయచూర్లో బస్సుయాత్ర సందర్భంగా కుమారస్వామిని అడ్డుకున్నారు రైతులు. అలాగే.. కొన్ని ఉద్యోగ సంఘాలు కూడా కుమారస్వామి తీరును తప్పుబట్టాయి. తమకు మరింత మెరుగైన వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. యర్మరూస్ థర్మల్ విద్యుత్ కేంద్రం కార్మికులు ఆయన బస్సును అడ్డుకుని నినాదాలు చేశారు. దీంతో.. సహనం కోల్పోయిన కర్నాటక సీఎం వాళ్లపై విరుచుకుపడి.. మేము మీకు నచ్చకపోతే మోదీకే ఓటు వేయాల్సిందని కుమారస్వామి మండిపడ్డారు. వెంటనే బస్సుకు […]
కర్నాటక ముఖ్యమంత్రి కుమార స్వామికి నిరసనల సెగ తగిలింది. రాయచూర్లో బస్సుయాత్ర సందర్భంగా కుమారస్వామిని అడ్డుకున్నారు రైతులు. అలాగే.. కొన్ని ఉద్యోగ సంఘాలు కూడా కుమారస్వామి తీరును తప్పుబట్టాయి. తమకు మరింత మెరుగైన వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. యర్మరూస్ థర్మల్ విద్యుత్ కేంద్రం కార్మికులు ఆయన బస్సును అడ్డుకుని నినాదాలు చేశారు. దీంతో.. సహనం కోల్పోయిన కర్నాటక సీఎం వాళ్లపై విరుచుకుపడి.. మేము మీకు నచ్చకపోతే మోదీకే ఓటు వేయాల్సిందని కుమారస్వామి మండిపడ్డారు. వెంటనే బస్సుకు దారి ఇవ్వాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.