నేర విచారణలో పాతకాలపు పద్ధతులు మానుకోండి: హోం మంత్రి అమిత్ షా
పోలీసులు నేర విచారణలో పాతకాలపు పద్ధతులకు స్వస్తి చెప్పి, సాంకేతికతను వినియోగించుకుని సైంటిఫిక్ పద్ధతుల్లో నిజాలు రాబట్టాలన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. బ్యూరో ఆఫ్ పోలీస్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (బీపీఆర్డీ) 49వ అవతరణ వేడుకల సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నేరస్తుడు, లేక నేర స్వభావం కలిగిన వారి విషయంలో ఇప్పటికే థర్డ్ డిగ్రీ ఉపయోగించడం, ఫోన్ ట్యాపింగ్ చేయడం వంటివి పాత పద్ధతులను విడిచిపెట్టాలని అమిత్ షా సూచించారు. నేరాలు జరిగినప్పుడు […]
పోలీసులు నేర విచారణలో పాతకాలపు పద్ధతులకు స్వస్తి చెప్పి, సాంకేతికతను వినియోగించుకుని సైంటిఫిక్ పద్ధతుల్లో నిజాలు రాబట్టాలన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. బ్యూరో ఆఫ్ పోలీస్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (బీపీఆర్డీ) 49వ అవతరణ వేడుకల సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నేరస్తుడు, లేక నేర స్వభావం కలిగిన వారి విషయంలో ఇప్పటికే థర్డ్ డిగ్రీ ఉపయోగించడం, ఫోన్ ట్యాపింగ్ చేయడం వంటివి పాత పద్ధతులను విడిచిపెట్టాలని అమిత్ షా సూచించారు.
నేరాలు జరిగినప్పుడు ఆ నేరానికి సంబంధించి ఫోరెన్సిక్ ఎవిడెన్స్ నిందితులను పట్టివ్వడంలో ఎంతో సహకరిస్తుందన్నారు అమిత్ షా. క్రిమినల్ కేసుల పరిష్కారంలో ఫోరెన్సిక్ ఎవిడెన్స్ చాలా కీలకమని తెలిపారు. ఫోరెన్సిక్ ఎవిడెన్స్ పక్కాగా ఉంటే క్రిమినల్ కేసుల్లో తీర్పులు వెల్లడించే న్యాయమూర్తులు, కేసును వాదించే డిఫెన్స్ లాయర్లలకు ఎంతో వెసులుబాటు ఉంటుందన్నారు. జాతీయ స్ధాయిలో పోలీస్ యూనివర్సిటీ మరియు ఫోరెన్సిక్ యూనివర్సిటీలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీనిపై త్వరలోనే కేంద్ర మంత్రి వర్గంలో చర్చిస్తామని చెప్పారు. మోడస్ ఓపెరెండీ బ్యూరోస్ విషయంలో ప్రధాని మోదీతో చర్చించినట్టు చెప్పారు హో మంత్రి.
బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (బీపీఆర్డీ) కేంద్ర హోం శాఖ పరిధిలో పనిచేస్తుంది. పోలీస్ విభాగాల్లో టెక్నాలజీ ఉపయోగాలను వివరించడంతో పాటు నేర విచారణలో అనుసరించాల్సిన పద్థతులపై ట్రైనింగ్ ఇస్తారు.