స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదంపై విచారణ అప్డేట్
స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదంపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఘటనకు సంబంధించిన అరెస్ట్ అయిన ముగ్గురు నిందితులను కస్టడీకి కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Vijayawada Fire Accident : స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదంపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఘటనకు సంబంధించిన అరెస్ట్ అయిన ముగ్గురు నిందితులను కస్టడీకి కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ముగ్గురు నుంచి మరికొన్ని విషయాలు సేకరించేందుకు వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని విజయవాడ 3వ ఏసిఎమ్ఎమ్ కోర్టులో వేసిన పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై నిందితుల తరుపున న్యాయవాది కౌంటర్ పిటిషన్ దాఖలు చేయనున్నారు.
కాగా విజయవవాడలోని ప్రైవేటు కోవిడ్ సెంటర్ స్వర్ణ ప్యాలెస్లో జరిగిన అగ్నిప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 10 మంది కరోనా బాధితులు మరణించగా, మరికొందరు గాయపడ్డారు. ఈ దారుణ ఘటనపై ప్రత్యేక టీమ్స్ దర్యాప్తు చేస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వం వేసిన జేసీ శివశంకర్ ఆధ్వర్యంలోని కమిటీ స్పీడ్గా పరిశీలన చేస్తోంది.
Also Read : బీజేపీ నేత సాధినేని యామినిపై పోలీసు కేసు