‘రెమ్యునరేషన్’ తగ్గింపుపై నిర్మాత సురేశ్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు
ఇంతకు ముందు చాలా రకాల ఫ్లూలు, వ్యాధులు.. దేశాల్ని కుదిపేశాయి కానీ ఇంత ఉదృతంగా ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ రావడం ద్వారా ప్రజలు భయపడ్డారని అన్నారు. అలాగే రెండు తెలుగు ప్రభుత్వాలు కూడా వెంటనే స్పందించి,
లాక్డౌన్తో ఇంటికే పరిమితమైన సెలబ్రిటీలు సోషల్ మీడియాలో యాక్టీవ్గా ఉంటున్నారు. అంతేకాకుండా.. పలు మీడియా ఛానెల్స్కి ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. అలాగే కొంత మంది స్టార్స్ వంటలు చేస్తూ.. తమ ఫ్యామిలీతో సరదాగా టైమ్ పాస్ చేస్తున్నారు. అలాగే తమ పాత మెమొరీస్ని ఫ్యాన్స్తో షేర్ చేసుకుంటున్నారు. అలా తాజాగా ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు ఓ ఛానెల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమలోని నటీనటులు, దర్శకులు రెమ్యునరేషన్ తగ్గించుకోవాల్సి ఉంటుందని.. పలు వ్యాఖ్యలు చేశారు.
లాక్డౌన్ కారణంగా నష్టపోయిన పలు దిగ్గజ సంస్థలు ఇప్పటికే పొదుపు చర్యలను మొదలు పెట్టాయని.. మరి ఈ పరిస్థితుల్లో టాలీవుడ్లో హీరో, హీరోయిన్లు, డైరెక్టర్లు, ఇతర ఆర్టిస్టులు తమ రెమ్యునరేషన్స్ తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుందా? అన్న యాంకర్ ప్రశ్నకు బదులుగా.. సురేశ్ బాబు మాట్లాడుతూ.. కేవలం టాలీవుడ్లోనే కాదు ఏ వ్యాపారంలోనైనా నష్టం వచ్చిందంటే.. తప్పనిసరిగా వారి జీతాలు తగ్గించుకోవాల్సి వస్తుంది. ఇక అలాగే భవిష్యత్తులో సినీ నటీనటులు, దర్శకులు రెమ్యునరేషన్ తగ్గించుకోవాల్సిన అవసరం వస్తే.. అది కూడా తప్పదని అభిప్రాయపడ్డారు సురేశ్ బాబు.
కాగా అలాగే పలు విషయాలపై ఆయన మాట్లాడారు. ఇంతకు ముందు చాలా రకాల ఫ్లూలు, వ్యాధులు దేశాల్ని కుదిపేశాయి కానీ.. ఇంతలా కరోనా వైరస్ ప్రపంచాన్ని కుదిపేయడం మొదటిసారన్నారు. అలాగే రెండు తెలుగు ప్రభుత్వాలు కూడా వెంటనే స్పందించి, కఠిన నిబంధనలు అమలు పరుస్తూ లాక్డౌన్ విధించాయన్నారు. ఇక అలాగే ప్రజలు కూడా జాగ్రత్తలు పాటిస్తూ.. పనులు చేసుకోవాలని చెప్పారు సురేశ్ బాబు.
Read More:
షాపుల ముందు మందు బాబుల క్యూ లైన్ చూసి షాక్ అయిన చంద్రబాబు!