ఆ ఇద్దరు దర్శకులు అంతే: పీవీపీ సంచలన వ్యాఖ్యలు

టాలీవుడ్‌లో ఉన్న బడా నిర్మాతల్లో పీవీపీ ఒకరు. తన నిర్మాణ సంస్థ పీవీపీ సినిమాస్‌ ద్వారా అటు పెద్ద హీరోలు, ఇటు చిన్న హీరోలతో ఇప్పటివరకు ఆయన మంచి సినిమాలే తెరకెక్కించారు. కాగా ఇటీవల దర్శకులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పీవీపీ. సౌత్‌లో ఉన్న ఇద్దరు దర్శకులు.. నిర్మాతలు తమ సెట్‌కు రాకూడదనేది షరతును పెడతారు అని ఆయన చెప్పుకొచ్చారు. తాను వాళ్ల పేర్లు చెప్పనని.. కానీ మన పక్క రాష్ట్రాల్లో వారు ఉన్నారని ఆయన తెలిపారు. […]

ఆ ఇద్దరు దర్శకులు అంతే: పీవీపీ సంచలన వ్యాఖ్యలు
Follow us

| Edited By:

Updated on: Aug 31, 2019 | 1:02 PM

టాలీవుడ్‌లో ఉన్న బడా నిర్మాతల్లో పీవీపీ ఒకరు. తన నిర్మాణ సంస్థ పీవీపీ సినిమాస్‌ ద్వారా అటు పెద్ద హీరోలు, ఇటు చిన్న హీరోలతో ఇప్పటివరకు ఆయన మంచి సినిమాలే తెరకెక్కించారు. కాగా ఇటీవల దర్శకులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పీవీపీ. సౌత్‌లో ఉన్న ఇద్దరు దర్శకులు.. నిర్మాతలు తమ సెట్‌కు రాకూడదనేది షరతును పెడతారు అని ఆయన చెప్పుకొచ్చారు. తాను వాళ్ల పేర్లు చెప్పనని.. కానీ మన పక్క రాష్ట్రాల్లో వారు ఉన్నారని ఆయన తెలిపారు. అయినా ఇక్కడ దర్శకులకు మంచి డిమాండ్‌ ఉందని.. ఎందుకంటే పెద్ద ప్రాజెక్టులు వారితోనే సాధ్యమవుతాయని పీవీపీ చెప్పారు. అందుకే వారిని విమర్శించలేమని.. ఈ విషయంలో నిర్మాతలకు మరోదారి లేదని పేర్కొన్నారు.

ఇక ఈ సందర్భంగా ‘బ్రహ్మోత్సవం’ సినిమా గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ‘బ్రహ్మోత్సవం’ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదని.. అందుకే పంపిణీ దారులకు తిరిగి డబ్బులు వెనక్కి ఇచ్చామని పీవీపీ గుర్తుచేశారు. ఇక ఈ సినిమా వైఫల్యానికి మహేష్ బాబును కూడా విమర్శించలేమన్నారు పీవీపీ. ఎందుకంటే మహేష్ ఎప్పుడూ దర్శకుల హీరో అని అవసరమైతే ఒక సీన్‌ను పది సార్లు చేస్తుంటారని ప్రశంసలు కురిపించారు. ఇక ఓ సినిమా ఎప్పుడూ దర్శకులపైనే ఆధారపడి ఉంటుందని.. దర్శకుడు అందరితో కలిసి పనిచేస్తే అవుట్‌పుట్‌ బాగా వస్తుందని తెలిపారు. నిర్మాతలు రూ. కోట్లు పెడుతుంటే.. కొందరు దర్శకులు స్క్రిప్టు పూర్తి కాకుండానే సెట్స్‌పైకి వెళ్తుంటారని ఆయన విమర్శించారు.

ఇదిలా ఉంటే ఈ ఏడాది రెండు విజయాలను సొంతం చేసుకున్నారు పీవీపీ. మహేష్ 25వ చిత్రం మహర్షికి ఆయన సహ నిర్మాతగా వ్యవహరించగా.. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డే నటించగా.. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించాడు. అలాగే  అడివి శేషు నటించిన ‘ఎవరు’ చిత్రాన్ని పీవీపీ నిర్మించారు. రెజీనా, నవీన్ చంద్ర, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ను తెచ్చుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి హిట్‌గా నిలిచింది.

ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు