అక్షయ్ కుమార్ ‘హెలికాప్టర్ పర్యటన’..విచారణకు ఆదేశం
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ చుట్టూ వివాదం ముసురుతోంది. లాక్డౌన్ అమలులో ఉన్నప్పుడు నిబంధనలు ఉల్లంఘించారని ఆయనపై అభియోగాలు వస్తున్నాయి.
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ చుట్టూ వివాదం ముసురుతోంది. లాక్డౌన్ అమలులో ఉన్నప్పుడు నిబంధనలు ఉల్లంఘించారని ఆయనపై అభియోగాలు వస్తున్నాయి. ఇటీవల అక్షయ్ ముంబై నుంచి నాసిక్కు హెలికాప్టర్లో వెళ్లడమే దీనికి మెయిన్ రీజన్. అయితే అక్షయ్కు స్పెషల్ పర్మిషన్ ఎవరిచ్చారనే దానిపై విచారణకు ఆదేశించినట్లు మహారాష్ట్ర మంత్రి చగన్ భుజ్బల్ వెల్లడించారు.
“అక్షయ్ నాసిక్ పర్యటన గురించి వార్తపత్రికల ద్వారా వివరాల తెలుసుకున్నాను. అతడు ఇక్కడికి వచ్చిన విషయం గురించి మాకైతే ముందస్తు సమాచారం లేదు. ఈ విషయాన్ని పరిశీలిస్తాం” మంత్రి భుజ్బల్ పేర్కొన్నారు. అయితే డాక్టర్ ని కలిసేందుకే అక్షయ్ నాసిక్కు వచ్చారని విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా కరోనా మహమ్మారి వీరవిహారం చేస్తోన్న నేపథ్యంలో భారీ విరాళాలు ప్రకటించి అక్షయ్ రియల్ హీరో అనిపించుకన్న విషయం తెలిసిందే.