బంగళా ఖాళీ వ్యవహారం.. ముందే యూపీ వెళ్లదలచిన ప్రియాంక గాంధీ
కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఢిల్లీ లోధీ రోడ్డులోని బంగళాను ఖాళీ చేయాలంటూ ప్రభుత్వం నుంచి ఆమెకు నోటీసు అందిన నేపథ్యంలో ఓ కొత్త విషయం బయటపడింది. యూపీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ఆమె లక్నోకి తన నివాసాన్ని..
కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఢిల్లీ లోధీ రోడ్డులోని బంగళాను ఖాళీ చేయాలంటూ ప్రభుత్వం నుంచి ఆమెకు నోటీసు అందిన నేపథ్యంలో ఓ కొత్త విషయం బయటపడింది. యూపీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ఆమె లక్నోకి తన నివాసాన్ని షిఫ్ట్ చేయాలనుకున్నారట. తాజాగా ఈ నోటీసు అందడంతో ఆమె తన యోచనలపై మరింత దృష్టి పెట్టనున్నారు. సెక్యూరిటీ కారణాల దృష్ట్యా.. ఆగస్టు 1 నాటికి ప్రియాంక ఈ భవనాన్ని ఖాళీ చేయాలని ఆమెకు నిన్న నోటీసు అందనుంది. పైగా రూ. 3.26 లక్షల బకాయిలు చెల్లించాలని కూడా ఆ నోటీసులో కోరారు. ఇందుకు వెంటనే ఆమె ఈ మొత్తాన్ని చెల్లించారు.
నిజానికి ప్రియాంక గాంధీ ఈ ఏడాది ఆరంభం లోనే తన నివాసాన్ని మార్చాలనుకున్నారని, కానీ కరోనా వైరస్ కారణంగాను, తన కుమార్తె మిరయా బోర్డు పరీక్షల దృష్ట్యాను ఆమె తన యోచనను వాయిదా వేసుకున్నారని తెలుస్తోంది. యూపీలో కాంగ్రెస్ నేత షీలా కౌల్ ఇంటినే ఆమె తన నివాసంగా చేసుకోనున్నారు. 2022 లో యూపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమెను తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ ట్వీట్ చేసింది.