ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేస్తూ.. తల్లి ఇంటికి సామాన్ల తరలింపు..

కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఢిల్లీలోని లోథీరోడ్‌లో ఉన్న ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేస్తున్నారు. గడువు ముందే ఆమె ప్రభుత్వ భవనాన్ని ఖాళీ చేస్తూ.. తన వ్యక్తిగత సామాన్లను తన తల్లి సోనియా నివాసానికి..

ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేస్తూ.. తల్లి ఇంటికి సామాన్ల తరలింపు..
Follow us

| Edited By:

Updated on: Jul 10, 2020 | 1:36 PM

కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఢిల్లీలోని లోథీరోడ్‌లో ఉన్న ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేస్తున్నారు. గడువు ముందే ఆమె ప్రభుత్వ భవనాన్ని ఖాళీ చేస్తూ.. తన వ్యక్తిగత సామాన్లను తన తల్లి సోనియా నివాసానికి తరలించారు. 10 జనపథ్‌ రోడ్డులో ఉన్న సోనియా గాంధీ నివాసానికి ఇప్పటికే సామాన్లన్నింటిని తరలించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ బంగ్లాను ఆగస్టు 1వ తేదీ నాటికి ఖాళీ చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. లోథీ ఎస్టేట్‌లోని 35వ నెంబర్ ప్రభుత్వ బంగ్లాలో ప్రియాంకా నివసిస్తోంది. అయితే ఇప్పుడు.. తన మకాంను ఢిల్లీ నుంచి యూపీ రాజధాని లక్నోకి మార్చాలన్న యోచనలో ఉన్నట్లు సమాచారం. కాగా, ఇప్పటికే ఆమెకు ఎస్పీజీ సెక్యూరిటీని కేంద్ర ప్రభుత్వం తొలగించింది. అయితే లక్నోలో నివాసం ఏర్పాటు చేసుకుంటే.. యూపీలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు.. రాబోయే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పట్టుసాధించేందుకు వీలుందని కాంగ్రెస్ నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు.