ప్రయాగ్రాజ్ నుండి ప్రియాంక ‘గంగా యాత్ర’ ప్రారంభం
యూపీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ చేపట్టిన గంగా యాత్ర ఇవాల్టి నుంచి ప్రారంభమైంది. ఈ రోజు నుంది 20వ తేదీ వరకు మూడు రోజుల పాటు గంగాయాత్ర సాగనుంది. ఈ సందర్భంగా ప్రియాంక ఆదివారమే ఉత్తరప్రదేశ్కు చేరుకుని స్థానిక నేతలతో చర్చించారు. ప్రయాగ్రాజ్ నుంచి వారణాసి వరకు ఆమె ఎలక్షన్ క్యాంపైన్ నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించిన రూట్ మ్యాప్ సిద్ధమైంది. యువతను, మహిళలను, రైతులను మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని…రాబోయే ఎలక్షన్లలో ప్రజలు తగిన […]
యూపీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ చేపట్టిన గంగా యాత్ర ఇవాల్టి నుంచి ప్రారంభమైంది. ఈ రోజు నుంది 20వ తేదీ వరకు మూడు రోజుల పాటు గంగాయాత్ర సాగనుంది. ఈ సందర్భంగా ప్రియాంక ఆదివారమే ఉత్తరప్రదేశ్కు చేరుకుని స్థానిక నేతలతో చర్చించారు. ప్రయాగ్రాజ్ నుంచి వారణాసి వరకు ఆమె ఎలక్షన్ క్యాంపైన్ నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించిన రూట్ మ్యాప్ సిద్ధమైంది. యువతను, మహిళలను, రైతులను మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని…రాబోయే ఎలక్షన్లలో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలంటూ ప్రియాంక పిలుపునిచ్చారు. గంగాయాత్ర సందర్భంగా భారీగా కార్యకర్తలు, నేతలు ప్రయాగ్రాజ్ చేరుకున్నారు.