లాక్ డౌన్ ఎఫెక్ట్ : సినిమా షూటింగ్ కోసం వెళ్లి ఆ దేశంలో చిక్కుకుపోయిన బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా
ప్రపంచాన్ని చిగురుటాకులా వణికించిన కరోనా మహమ్మారి మరో సారి విజృంభిస్తుంది. ఇప్పుడిప్పుడే కరోనా వ్యాప్తి తగ్గుతుందని..
ప్రపంచాన్ని చిగురుటాకులా వణికించిన కరోనా మహమ్మారి మరో సారి విజృంభిస్తుంది. ఇప్పుడిప్పుడే కరోనా వ్యాప్తి తగ్గుతుందని ఉపిరిపీల్చుకుంటున్నసమయంలో మరోసారి స్ట్రెయిన్ గా రూపంలో పంజా విసరాలని చూస్తుంది. ఇదిలా ఉంటే కరోనా వ్యాక్సిన్ వేయడం మొదలైనప్పటికీ యూకేలో దాని తీవ్రత తగ్గడం లేదు. కేసులు రోజురోజుకు పెరిగిప్తుండటంతో పరిస్థితి చేయిదాటి పోయిందని భావించిన అక్కడి ప్రభుత్వం మరో సారి లాక్ డౌన్ ను విధించింది. ఇందులో భాగంగానే ఇంగ్లాండ్ నుంచి విదేశాలకు విమానాల రాకపోకలు కూడా నిలిచిపోయాయి. ఈ క్రమంలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంకచోప్రా లండన్ లో చిక్కుకుపోయింది తెలుస్తుంది.
ఇటీవల వరుసగా సినిమాలను చేస్తున్న ప్రియాంకా ఓ హాలీవుడ్ సినిమా షూటింగ్ కోసం యూకే వెళ్ళింది.. లాక్ డౌన్ కారణంగా ప్రియాంక మరికొన్ని రోజులు అక్కడే ఉండిపోవాల్సి వస్తోంది. ‘టెక్ట్స్ ఫర్ యూ’ అనే హాలీవుడ్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో హాలీవుడ్ నటుడు సామ్ హ్యూగన్ కు జోడీగా ప్రియాంక కనిపించనుంది. జిమ్ స్ట్రౌస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ లండన్ లో ప్లాన్ చేశారు. దీని కోసం అక్కడికి వెళ్లిన ప్రియాంక ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా అక్కడే ఇరుక్కుపోయింది.