మోదీ.. నా ఛాలెంజ్కి సిద్ధమా..? : ప్రియాంక
దేశరాజధాని ఢిల్లీలో తొలిసారి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రియాంకా గాంధీ. ఈశాన్య ఢిల్లీ నియోజకవర్గంలో షీలాదీక్షిత్ తరపున ఆమె ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి సవాల్ విసిరారు. ఈ ఎన్నికల్లో జీఎస్టీ, నోట్ల రద్దు, మహిళా భద్రత అంశాలపై ప్రచారానికి వెళ్లాలని ప్రధాని మోదీకి చాలెంజ్ చేశారు. కాగా ఈశాన్య ఢిల్లీలో ప్రియాంక చేపట్టిన రోడ్షోకు విశేష స్పందన లభించింది.
దేశరాజధాని ఢిల్లీలో తొలిసారి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రియాంకా గాంధీ. ఈశాన్య ఢిల్లీ నియోజకవర్గంలో షీలాదీక్షిత్ తరపున ఆమె ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి సవాల్ విసిరారు. ఈ ఎన్నికల్లో జీఎస్టీ, నోట్ల రద్దు, మహిళా భద్రత అంశాలపై ప్రచారానికి వెళ్లాలని ప్రధాని మోదీకి చాలెంజ్ చేశారు. కాగా ఈశాన్య ఢిల్లీలో ప్రియాంక చేపట్టిన రోడ్షోకు విశేష స్పందన లభించింది.