నిబంధనలకు తూట్లు పొడుస్తూ.. తెరుచుకున్న ప్రైవేటు స్కూల్
ఓ వైపు దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఈ ఏడాది ప్రారంభం కావాల్సిన విద్యాసంస్థలు ఇంకా ప్రారంభం కాలేదు. అయితే కొన్న రాష్ట్రాల్లో మాత్రం..
ఓ వైపు దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఈ ఏడాది ప్రారంభం కావాల్సిన విద్యాసంస్థలు ఇంకా ప్రారంభం కాలేదు. అయితే కొన్న రాష్ట్రాల్లో మాత్రం ఆన్లైన్ తరగతులు నిర్వహస్తున్నాయి. అయితే యూపీలో ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం మాత్రం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలను పట్టించుకోకుండా.. యథేచ్చగా విద్యార్ధులకు తరగతులు నిర్వహిస్తోంది. జలాన్లోని ఓ ప్రైవేట్ స్కూల్ మంగళవారం తెరిచిఉంది. విద్యార్ధులను బలవంతంగా స్కూల్కు రప్పించి తరగతులను నిర్వహించింది. కరోనా మార్గదర్శకాలను పట్టించుకోకుండా.. స్కూలు యాజమాన్యం ఇష్టారీతిగా వ్యవహరించింది. అంతేకాదు.. తరగతుల్లో హాజరైన విద్యార్ధులకు కనీస నిబంధనలు కూడా లేవు. ఒక్కరికి కూడా మాస్కులు లేవు. ఈ ఘటనకు సంబంధించి విషయం తెలుసుకున్నవిద్యాశాఖ అధికారులు.. నిబంధనలు ఉల్లంఘించి స్కూలు తెరిచిన ప్రైవేట్ స్కూల్ మేనేజర్, ప్రిన్సిపాల్పై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
A private school in Jalaun conducted classes by calling students to the school amid #COVID19. Premchand, Basic Shiksha Adhikari says, “No instructions have been issued by govt to reopen schools. Strict action will be taken against the manager & principal of the school.” (18.8) pic.twitter.com/HHeNscvA6L
— ANI UP (@ANINewsUP) August 19, 2020
Read More :