జమ్ముకశ్మీర్లో గవర్నర్ పాలన పొడిగింపు
జమ్ముకశ్మీర్లో గవర్నర్ పాలనను కేంద్రం మరో ఆరు నెలలు పొడగించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి ప్రకాశ్ జావదేకర్ వెల్లడించారు. జమ్ముకశ్మీర్ జూలై 3 నుంచి మరో 6 నెలల పాటు గవర్నర్ పాలన కొనసాగనుందని ఆయన తెలిపారు. ఈ ఏడాది చివర్లో జమ్ముకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అమర్నాథ్ యాత్ర ముగిశాక ఎన్నికల సంఘం షెడ్యూల్ను […]
జమ్ముకశ్మీర్లో గవర్నర్ పాలనను కేంద్రం మరో ఆరు నెలలు పొడగించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి ప్రకాశ్ జావదేకర్ వెల్లడించారు. జమ్ముకశ్మీర్ జూలై 3 నుంచి మరో 6 నెలల పాటు గవర్నర్ పాలన కొనసాగనుందని ఆయన తెలిపారు. ఈ ఏడాది చివర్లో జమ్ముకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అమర్నాథ్ యాత్ర ముగిశాక ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేయనుంది. జూలై ఒకటిన అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానుండగా, 46 రోజులపాటు ఇది కొనసాగనుంది. యాత్ర ముగిసిన అనంతరం షెడ్యూలు విడుదల చేసేందుకు ఈసీ సమాయత్తం అవుతోంది.