పౌరసత్వ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర..అమల్లోకి కొత్త చట్టం
పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ బిల్లు(2019) కు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదం లభించింది. దీంతో సదరు బిల్లు చట్టంగా మారింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి అఫిసియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. పౌరసత్వ చట్టం ప్రకారం… పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ల నుంచి.. మతపరమైన ఒత్తిళ్లు ఎదుర్కొని భారతదేశానికి వచ్చి శరణార్థులుగా నివశిస్తోన్న వారికి భారత సిటిజన్షిప్ లభించనుంది. డిసెంబర్ 31, 2014 కి ముందు వచ్చిన హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, జైనులు, […]
పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ బిల్లు(2019) కు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదం లభించింది. దీంతో సదరు బిల్లు చట్టంగా మారింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి అఫిసియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. పౌరసత్వ చట్టం ప్రకారం… పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ల నుంచి.. మతపరమైన ఒత్తిళ్లు ఎదుర్కొని భారతదేశానికి వచ్చి శరణార్థులుగా నివశిస్తోన్న వారికి భారత సిటిజన్షిప్ లభించనుంది. డిసెంబర్ 31, 2014 కి ముందు వచ్చిన హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, జైనులు, బౌద్ధులు, పార్శీలకు మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుంది.
పౌరసత్వ సవరణ బిల్లు లోక్సభలో సోమవారం, రాజ్యసభలో బుధవారం ఆమోదం పొందింది. గురువారం రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. కాగా బిల్లుపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. అసోంలో చట్టాన్ని వ్యతిరేకిస్తూ తీవ్ర స్థాయిలో అల్లర్లు కొనసాగుతున్నాయి. ఈ బిల్లను తెలుగు రాష్ట్రాల నుంచి ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ మద్దతు ప్రకటించగా, టీఆర్ఎస్ వ్యతిరేకించింది.