రాష్ట్రపతి భవన్ లో ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం

న్యూఢిల్లీ :  ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ చేతుల మీదుగా 2019గాను మొత్తం 112 మందిలో 56 మందికి పురస్కారాలు అందించారు. అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఉపరాష్ట్రప్రతి వెంకయ్య, ప్రధాని మోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌‌తో పాటూ పలువురు ప్రముఖులు హాజరయ్యారు. పుర‌స్కారాలు అందుకున్న వారిలో న‌టుడు మోహ‌న్ లాల్ (ప‌ద్మ‌భూష‌ణ్‌), ద్రోణ‌వ‌ల్లి హారిక (ప‌ద్మ‌శ్రీ), న‌టుడు ప్ర‌భుదేవా (ప‌ద్మ‌శ్రీ), సంగీత ద‌ర్శ‌కుడు, గాయ‌కుడు శంక‌ర్ మ‌హ‌దేవ‌న్ (పద్మ‌శ్రీ), […]

రాష్ట్రపతి భవన్ లో ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం
Follow us

| Edited By:

Updated on: Mar 11, 2019 | 12:51 PM

న్యూఢిల్లీ :  ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ చేతుల మీదుగా 2019గాను మొత్తం 112 మందిలో 56 మందికి పురస్కారాలు అందించారు. అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఉపరాష్ట్రప్రతి వెంకయ్య, ప్రధాని మోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌‌తో పాటూ పలువురు ప్రముఖులు హాజరయ్యారు. పుర‌స్కారాలు అందుకున్న వారిలో న‌టుడు మోహ‌న్ లాల్ (ప‌ద్మ‌భూష‌ణ్‌), ద్రోణ‌వ‌ల్లి హారిక (ప‌ద్మ‌శ్రీ), న‌టుడు ప్ర‌భుదేవా (ప‌ద్మ‌శ్రీ), సంగీత ద‌ర్శ‌కుడు, గాయ‌కుడు శంక‌ర్ మ‌హ‌దేవ‌న్ (పద్మ‌శ్రీ), ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్ కుల‌దీప్ న‌య్య‌ర్ (పద్మ‌భూష‌ణ్‌- మ‌ర‌ణానంతరం) వంటి ప్ర‌ముఖులు ఉన్నారు. మిగిలినవారికి ఈ నెల 16న జరిగే తదుపరి కార్యక్రమంలో పురస్కారాలు ప్రదానం చేస్తారు.