Big Breaking : “ఉరి”కి రూట్ క్లియర్.. క్షమాభిక్ష పిటిషన్లను రిజక్ట్ చేసిన రాష్ట్రపతి..!
నిర్భయ దోషి పవన్ గుప్తా దాఖలు చేసుకున్న క్షమాభిక్ష పిటిషన్ను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తిరస్కరించారు. దీంతో నలుగురు దోషులకు దాదాపు అన్ని దారులు మూసుకున్నట్లయ్యింది.
నిర్భయ దోషి పవన్ గుప్తా దాఖలు చేసుకున్న క్షమాభిక్ష పిటిషన్ను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తిరస్కరించారు. దీంతో నలుగురు దోషులకు దాదాపు అన్ని దారులు మూసుకున్నట్లయ్యింది. దీంతో రేపు ఉదయం 6.00 గంటలకు నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలు కానుంది. రాష్ట్రపతి పిటిషన్ను రిజెక్ట్ చేయడంతో.. ఇంకా న్యాయపరంగా మళ్లీ స్టే పడే అవకాశం లేకపోవడంతో.. తీహార్ జైలు అధికారులు ఉరిశిక్ష అమలుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాదు.. ఉరిశిక్ష అమలుపై రిహార్సల్స్ కూడా చేస్తున్నారు.