అమ్మా.. ఎలా ఉన్నారు..? మోదీ తల్లితో రాష్ట్రపతి

భారత ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తిని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆదివారం నాడు మర్యాద పూర్వకంగా కలిశారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయన శనివారం గుజరాత్‌ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం గాంధీనగర్‌లో నివాసముంటున్న ప్రధాని తల్లి హీరాబెన్‌ (99) నివాసానికి వెళ్లారు. ఆమె తన చిన్న కుమారుడు ప్రకాష్ మోదీ దగ్గర ఉంటున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ సుమారు అరగంట సేపు ఆమెతో మాట్లాడి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. రామ్‌నాథ్ కోవింద్ వెంట […]

అమ్మా.. ఎలా ఉన్నారు..? మోదీ తల్లితో రాష్ట్రపతి
Follow us

| Edited By:

Updated on: Oct 13, 2019 | 5:35 PM

భారత ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తిని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆదివారం నాడు మర్యాద పూర్వకంగా కలిశారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయన శనివారం గుజరాత్‌ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం గాంధీనగర్‌లో నివాసముంటున్న ప్రధాని తల్లి హీరాబెన్‌ (99) నివాసానికి వెళ్లారు. ఆమె తన చిన్న కుమారుడు ప్రకాష్ మోదీ దగ్గర ఉంటున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ సుమారు అరగంట సేపు ఆమెతో మాట్లాడి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. రామ్‌నాథ్ కోవింద్ వెంట ఆయన సతీమణి సవిత కూడా వెళ్లారు. అనంతరం కోవింద్ దంపతులు అక్కడికి సమీపంలోని మహావీర్ జైన్ ఆరాధనా కేంద్రాన్ని దర్శించారు.