Director Prashanth Neel: ప్రభాస్ సినిమా పై వస్తున్న రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్..
కేజీఎఫ్ సినిమాతో జాతీయ స్థాయి డైరెక్టర్గా గుర్తింపు పొందాడు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం 'కేజీఎఫ్-2' సినిమా చిత్రీకరిస్తున్నాడు. ఇటీవలే
కేజీఎఫ్ సినిమాతో జాతీయ స్థాయి డైరెక్టర్గా గుర్తింపు పొందాడు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం ‘కేజీఎఫ్-2’ సినిమా చిత్రీకరిస్తున్నాడు. ఇటీవలే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో కలిసి ‘సలార్’ మూవీని తీయబోతున్నట్లుగా ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచాడు ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్. ఇక ‘సలార్’ సినిమా ప్రకటించినప్పటి నుంచి దాని గురించి ఏదో ఒక వార్త నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. తాజాగా ఈ వార్తలపై దర్శకుడు ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇచ్చాడు.
ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న ‘సలార్’ సినిమా ఫుల్ యాక్షన్ బ్యాక్గ్రౌండ్తో రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ మూవీని ప్రశాంత్ నీల్ కేవలం నాలుగు నెలల్లో పూర్తిచేయాలని భావిస్తున్నాడట డైరెక్టర్. ఈ క్రమంలోనే ‘సలార్ సినిమా ఏ మూవీకి రీమేక్ కాదని.. అదేవిధంగా కేజీఎఫ్ స్టోరీని రాసే సమయంలోనే సలార్ సినిమా కథను కూడా రాసుకున్నామని’ చెప్పాడు. అలాగే ఈ సినిమాలో హీరో ముందుగా అమాయకంగా ఉండాలి.. ఆ తర్వాత వయోలెంట్గా మారతాడు. అందుకోసమే ప్రభాస్ను సెలక్ట్ చేసుకున్నామని తెలిపాడు. ఇటీవలే రాధేశ్యామ్ మూవీ చిత్రీకరణ పూర్తిచేసుకున్న ప్రభాష్ సలార్ కోసం సిద్ధమవుతున్నాడు. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Also Read:
బిగ్బాస్ బ్యూటీ సంతోషం… తన జీవితంలో ఓ మంచి రోజు నేడు అంటూ పోస్ట్… ఎందుకో తెలుసా…