ప్రణయ్ హత్యకేసులో మారుతీరావు విడుదల
మిర్యాలగూడలో తీవ్ర సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యకేసులో ప్రధాన నిందితుడు, అమృత తండ్రి మారుతీరావు జైలు నుంచి విడుదలయ్యాడు. ఉదయం వరంగల్ సెంట్రల్ జైలు నుంచి ఆయన బెయిల్పై బయటకొచ్చాడు. ఈ కేసులో చార్జ్ షీట్ దాఖలు ప్రక్రియ పూర్తి కావడంతో హైకోర్టు నిందితులందరికీ శనివారం నాడు బెయిల్ మంజూరు అయ్యింది. అయితే, బెయిల్ పేపర్లు జైలు అధికారులకు అందడం ఆలస్యం కావడంతో మారుతీరావు విడుదల ఒక రోజు ఆలస్యమైంది. నిన్న రాత్రి బెయిల్ పత్రాలు జైలుకు […]
మిర్యాలగూడలో తీవ్ర సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యకేసులో ప్రధాన నిందితుడు, అమృత తండ్రి మారుతీరావు జైలు నుంచి విడుదలయ్యాడు. ఉదయం వరంగల్ సెంట్రల్ జైలు నుంచి ఆయన బెయిల్పై బయటకొచ్చాడు. ఈ కేసులో చార్జ్ షీట్ దాఖలు ప్రక్రియ పూర్తి కావడంతో హైకోర్టు నిందితులందరికీ శనివారం నాడు బెయిల్ మంజూరు అయ్యింది. అయితే, బెయిల్ పేపర్లు జైలు అధికారులకు అందడం ఆలస్యం కావడంతో మారుతీరావు విడుదల ఒక రోజు ఆలస్యమైంది. నిన్న రాత్రి బెయిల్ పత్రాలు జైలుకు అందడంతో, ఈ ఉదయం ఆయన విడుదలయ్యారు. మారుతీరావుతో పాటు శ్రవణ్కుమార్, కరీంలు కూడా జైలు నుంచి బయటకు వచ్చారు. తన తండ్రి మారుతీరావుతో తనకు ప్రాణాపాయం ఉందని ఆరోపిస్తుంది ప్రణయ్ భార్య అమృత.