Breaking: ప్రణయ్ హత్య కేసు నిందితుడి షెడ్లో మృతదేహం కలకలం
తెలంగాణలోని నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మృతదేహం కలకలం రేపుతోంది. ప్రణయ్ హత్యకేసు నిందితుడు మారుతీరావు షెడ్లో ఓ మృతదేహం లభించింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.
తెలంగాణలోని నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మృతదేహం కలకలం రేపుతోంది. ప్రణయ్ హత్యకేసు నిందితుడు మారుతీరావు షెడ్లో ఓ మృతదేహం లభించింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. కాగా తమ కుమార్తె కులాంతర వివాహం చేసుకుందన్నందుకు మారుతీరావు 2018 సెప్టెంబర్లో ప్రణయ్ను హత్య చేయించాడు. సుపారీ ఇచ్చి మరి మారుతీ రావు ఈ హత్య చేయించగా.. ఈ సంఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్ రాగా.. ప్రస్తుతం వారు బయటనే ఉన్నారు. ఈ క్రమంలో మారుతీరావు షెడ్లో మృతదేహం లభించడం స్థానికంగా కలకలం రేపుతోంది.