Janasena worker suicide: ఎమ్మెల్యే తిట్టాడని జనసేన కార్యకర్త సూసైడ్, ప్రశ్నిస్తే ప్రాణాలు పోగొట్టుకోవల్సిందేనా అన్న జనసేనాని
కాశం జిల్లా బెస్తవారిపేట మండలం సింగరపల్లి పల్లి లో విషాద ఘటన చోటు చేసుకుంది. పురుగుమందు తాగి జనసేన కార్యకర్త వెంగయ్య నాయుడు ఆత్మహత్యకు...
Janasena worker suicide:ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం సింగరపల్లి పల్లి లో విషాద ఘటన చోటు చేసుకుంది. పురుగుమందు తాగి జనసేన కార్యకర్త వెంగయ్య నాయుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత రెండు రోజుల క్రితం స్థానిక ఎమ్మెల్యే అన్నా రాంబాబును తమ గ్రామంలో ఉన్న రోడ్లు, డ్రైనేజ్ పరిస్థితి తెలియజేస్తూ మృతుడు నిలదీశాడు. దీంతో ఎమ్మెల్యే వెంకయ్య నాయుడుపై దుర్భాషలాడుతూ తిట్లు తిట్టాడు. ఎమ్మెల్యే రాంబాబు తిట్టిన తిట్లకు మనస్తాపం చెందిన వెంగయ్య ఆత్మహత్య చేసుకున్నాడని జనసేన కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
ఎమ్మెల్యే తిట్టినట్టు సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ విషయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి స్థానిక ఇంచార్జ్ తీసుకెళ్ళగా ..ఆయన స్పందించారు. వెంగయ్య మృతి కి అధికార పక్షమే భాద్యత వహించాలని పవన్ ఓ లెటర్ ను విడుదల చేశారు. గ్రామంలో పారిశుధ్య సమస్య పరిష్కరించమని అడిగితే ప్రాణాలు పోగొట్టుకోవాల్సిందేనా అంటూ ప్రశ్నించారు. ఈ ఆత్మహత్య ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనమని.. ఎమ్మెల్యే తో పాటు అతని అనుచరులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలనీ జనసేనానాని డిమాండ్ చేశారు.
Also Read: దీదీని అక్కడ 50 వేల ఓట్ల తేడాతో ఓడించకపోతే రాజకీయ సన్యాసమే అంటున్న బీజేపీ నేత