ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్న్యూస్.. రెడీ అవుతున్న సర్ప్రైజ్ గిఫ్ట్
ప్రభాస్ ఫ్యాన్స్ ఇన్ని రోజుల ఎదురుచూపుకు ఫలితం దక్కనుందా..? త్వరలోనే అభిమానులకు ప్రభాస్ టీమ్ ట్రీట్ ఇవ్వబోతుందా..? అంటే అవుననే మాటలే వినిపిస్తున్నాయి
ప్రభాస్ ఫ్యాన్స్ ఇన్ని రోజుల ఎదురుచూపుకు ఫలితం దక్కనుందా..? త్వరలోనే అభిమానులకు ప్రభాస్ టీమ్ ట్రీట్ ఇవ్వబోతుందా..? అంటే అవుననే మాటలే వినిపిస్తున్నాయి ఫిలింనగర్ వర్గాల్లో. ప్రస్తుతం ప్రభాస్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఓ పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్టైనర్లో నటిస్తున్న విషయం తెలిసిందే. 2018లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లినప్పటికీ.. ఇంతవరకు టైటిల్ గానీ ఫస్ట్లుక్ గానీ విడుదల కాలేదు. దీంతో ఫ్యాన్స్ పలువురు అసహనం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న యూవీ క్రియేషన్స్పై ఎన్నోసార్లు నెట్టింట విమర్శలు చేస్తూ వచ్చారు ప్రభాస్ అభిమానులు.
కాగా తాజా సమాచారం ప్రకారం ఈ నెల 14న ఈ సినిమా నుంచి ఫ్యాన్స్కి ట్రీట్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ నుంచి ఫస్ట్లుక్ గానీ లేదా టైటిల్ లోగోను గానీ విడుదల చేయాలన్న ఆలోచనలో ప్రభాస్ టీమ్ ఉందట. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా మొదలైనట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే ప్రభాస్ ఫ్యాన్స్కి నిజంగా శుభవార్తే. కాగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా.. భాగ్యశ్రీ, జగపతిబాబు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్, గోపికృష్ణ బ్యానర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
Read This Story Also: పరిస్థితి మరింత దిగజారుతోంది.. కరోనాపై డబ్ల్యూహోచ్ఓ హెచ్చరిక