నాగ్ అశ్విన్ మూవీలో డార్లింగ్ డ్యుయల్ రోల్..!
డార్లింగ్ ప్రభాస్ రేంజ్ ఇప్పడు సాదా సీదా లెవల్ కాదు. 'బాహుబలి' సిరీస్, 'సాహో' సినిమాలతో నేషనల్ మార్కెట్ లో తన సత్తా చూపాడు యంగ్ రెబల్ స్టార్. ఇప్పుడు దేశవ్యాప్తంగా అతడికి ఫ్యాన్ బేస్ ఉంది.
డార్లింగ్ ప్రభాస్ రేంజ్ ఇప్పడు సాదా సీదా లెవల్ కాదు. ‘బాహుబలి’ సిరీస్, ‘సాహో’ సినిమాలతో నేషనల్ మార్కెట్ లో తన సత్తా చూపాడు యంగ్ రెబల్ స్టార్. ఇప్పుడు దేశవ్యాప్తంగా అతడికి ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే ఇప్పుడు ప్రభాస్ చేసే ఏ మూవీ అయినా పాన్ ఇండియా రేంజ్లో ఉండాల్సిందే. ఈ హీరో ప్రజంట్ ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధేశ్యామ్’ అనే మూవీ చేస్తున్నాడు. అయితే ఈ చిత్రం తర్వాత నాగ్ అశ్విన్తో ఓ సినిమా కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన అఫిషియల్ ప్రకటన కూడా వచ్చింది. తాజా ఈ మూవీ గురించి ఓ ఆసక్తికర వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
సైన్స్ ఫిక్షన్ స్టోరీతో తెరకెక్కనున్న ఈ మూవీలో ప్రభాస్ డ్యుయల్ రోల్ చేయబోతున్నాడట. అవి కూడా.. విభిన్నత ఉండే పాత్రలు పోషించబోతున్నాడని సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమన్నది తెలియాలంటే మరికొంతకాలం వెయిట్ చేయాల్సిందే. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘రాధేశ్యామ్’ ఫస్ట్లుక్ ఇటీవలే విడుదలై మంచి అభిమానులను అలరించింది. ఇందులో పూజా హెగ్దే హీరోయిన్గా నటిస్తోన్న విషయం తెలిసిందే. కోవిడ్-19 ప్రభావం తగ్గిన తర్వాత షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది.