క్రేజీ రికార్డు ఖాతాలో వేసుకున్న ప్రభాస్..సౌత్ ఇండియాలోనే టాప్..
ప్రభాస్..ఈ పేరు ఇప్పుడు సౌత్ ఇండియాలోనే కాదు, దేశమంతటా ఫేమస్. 'బాహుబలి', 'సాహో' సినిమాలతో లెక్కకు మించిన అభిమానుల్ని సంపాదింకున్నాడు యంగ్ రెబల్ స్టార్.
ప్రభాస్..ఈ పేరు ఇప్పుడు సౌత్ ఇండియాలోనే కాదు, దేశమంతటా ఫేమస్. ‘బాహుబలి’, ‘సాహో’ సినిమాలతో లెక్కకు మించిన అభిమానుల్ని సంపాదింకున్నాడు యంగ్ రెబల్ స్టార్. బయట కూడా సాదా సీదాగా ఉంటూ తన క్రేజ్ మరింత పెంచుకున్నాడు. తాజాగా ఈ ఆరడుగుల అందగాడు..సోషల్ మీడియాలో క్రేజీ ఫీట్ సొంతం చేసుకున్నాడు. ఫేస్బుక్లో 16 మిలియన్ల ఫాలోవర్ల మార్క్ను దాటి చరిత్రను లిఖించాడు. ఈ ఘనత సాధించిన తొలి సాత్ హీరోగా నిలిచాడు. ఇందునా 1 మిలియన్ నుంచి 16 మిలియన్ ఫాలోవర్లను చాలా త్వరగా అందుకున్న హీరో కూడా ప్రభాసే కావడం విశేషం.
డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలే ఫస్ట్లుక్ పోస్టర్ను రిలీజ్ చేయగా, 24 గంటల్లో 6.3 మిలియన్ ట్వీట్లతో రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ నటిస్తుండగా..’జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. 1920ల నాటి యూరప్ నేపథ్య కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతుంది. యువీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం కోవిడ్ నేపథ్యంలో వాయిదా పడ్డ ఈ చిత్ర షూటింగ్..పరిస్థితులు కుదుటపడ్డ అనంతరం పునఃప్రారంభం అవ్వనుంది.