Saaho: కోర్టు ఆర్డర్స్.. భారీగా పెరిగిన ‘సాహో’ టికెట్ ధరలు
‘బాహుబలి’ ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్తో నిర్మించిన మూవీ ‘సాహో’. భారీ అంచనాలతో వస్తున్న ఈ మూవీ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. కోర్టు ఆర్డర్స్ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ‘సాహో’ టికెట్ ధరలను థియేటర్ యజమాన్యాలు పెంచాయి. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్రోడ్స్లోని ఓ థియేటర్లో పన్నుతో కలిపి రూ.112 ఉన్న టికెట్ రూ.150కు పెరిగింది. రూ.80 టికెట్ రూ.100కు, రూ.40 టికెట్ రూ.50కు పెరిగింది. ఈ ధరలు కేవలం సినిమా వచ్చిన మొదటి వారం […]
‘బాహుబలి’ ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్తో నిర్మించిన మూవీ ‘సాహో’. భారీ అంచనాలతో వస్తున్న ఈ మూవీ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. కోర్టు ఆర్డర్స్ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ‘సాహో’ టికెట్ ధరలను థియేటర్ యజమాన్యాలు పెంచాయి. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్రోడ్స్లోని ఓ థియేటర్లో పన్నుతో కలిపి రూ.112 ఉన్న టికెట్ రూ.150కు పెరిగింది. రూ.80 టికెట్ రూ.100కు, రూ.40 టికెట్ రూ.50కు పెరిగింది. ఈ ధరలు కేవలం సినిమా వచ్చిన మొదటి వారం వరకే ఉండేందుకు అనుమతి ఉంది. జంట నగరాల్లోని 127 సినిమా హాళ్లలో ఈ పెరిగిన రేట్లు అమల్లోకి రానున్నాయి. ఆన్లైన్లోనూ ఈ ధరలతోనే టికెట్ విక్రయాలు జరుగుతున్నాయి. బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ హీరోయిన్గా రాబోతున్న ఈ చిత్రానికి యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వం వహించాడు. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది.