మర్డర్ కేసులో పాముకు శవపరీక్షలు..ఏం తేలిందంటే..!
కేరళ కొల్లాంలో ‘పాము స్కెచ్’తో భార్యను హత్య చేసిన ఉదంతం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు స్పీడ్ పెంచారు. మర్డర్ కోసం ఉపయోగించిన పామును బయటకు తీసి శవపరీక్ష చేశారు. పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది నిందితుడి ఇంటికి వెళ్లి పాము కళేబరాన్ని పాతిపెట్టిన ప్లేస్ గుర్తించి జాగ్రత్తగా తవ్వి బయటకు తీశారు. పాము కాటు వల్లే ఉత్రా ప్రాణాలు విడిచిందనే విషయం శవపరీక్షల్లో వెల్లడైందని అధికారులు వెల్లడించారు. దాదాపు 152 […]
కేరళ కొల్లాంలో ‘పాము స్కెచ్’తో భార్యను హత్య చేసిన ఉదంతం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు స్పీడ్ పెంచారు. మర్డర్ కోసం ఉపయోగించిన పామును బయటకు తీసి శవపరీక్ష చేశారు. పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది నిందితుడి ఇంటికి వెళ్లి పాము కళేబరాన్ని పాతిపెట్టిన ప్లేస్ గుర్తించి జాగ్రత్తగా తవ్వి బయటకు తీశారు.
పాము కాటు వల్లే ఉత్రా ప్రాణాలు విడిచిందనే విషయం శవపరీక్షల్లో వెల్లడైందని అధికారులు వెల్లడించారు. దాదాపు 152 సెంటిమీటర్ల పొడవైన పాము ఇప్పటికే కుళ్లిపోయే దశలో ఉందని, అయితే శవపరీక్షకు అవసరమైన శాంపిల్స్ తీసుకోగలిగినట్లు పేర్కొన్నారు. పాము కోరలను సైతం నమూనాల కోసం తీసుకున్నట్లు వెల్లడించారు. ఫోరెన్సిక్ టీమ్ సేకరించిన శాంపిల్స్ తదుపరి టెస్టుల కోసం పంపించనున్నట్లు అధికారులు తెలిపారు. తుది ఫలితాలను కోర్టుకు సమర్పించనున్నట్లు వివరించారు. హత్య కేసులో ఇంకెవరి పాత్ర అయినా ఉందా? అనే విషయంపై విచారణ చేస్తున్నట్టు వెల్లడించారు.
రెండో పెళ్లి చేసుకోవాలన్న దుర్బుద్దితోనే తన భార్య ఉత్రాను పాముతో కరిపించి హత్య చేశాడు సూరజ్. యూట్యూబ్లో పాముల ద్వారా ఎలా మనుషులను చంపొచ్చో తెలుసుకొని పక్కా ప్లాన్ ప్రకారం ఈ మర్డర్ చేశాడు. హత్యకు ఉపయోగించిన పామును ఓ కంటైనర్లో దాచి ఇంటి పెరట్లో పాతిపెట్టాడు.