తెరుచుకున్న కేదార్నాథ్ ద్వారాలు
పరమ పవిత్ర పుణ్యక్షేత్రం కేదార్నాథ్ ఆలయం ఇవాళ తలుపులు తెరుచుకుంది. దీంతో కేదార్నాథుని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారు జామునుంచే క్యూ కట్టారు. ఆరు నెలల పాటు భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంది. అక్టోబర్-నవంబర్ మధ్యకాలంలో మళ్లీ ఈ ఆలయాన్ని మూసివేస్తారు. భక్తులకు ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శీతాకాలంలో ఈ ఆలయ ప్రాంతంలో విపరీతమైన మంచు కురుస్తుంది. ఈ కారణంగా ఆలయాన్ని మూసివేస్తారు. అనంతరం వేసవి ఆరంభమైన కొద్దిరోజులకు ఆలయ ద్వారాలను […]
పరమ పవిత్ర పుణ్యక్షేత్రం కేదార్నాథ్ ఆలయం ఇవాళ తలుపులు తెరుచుకుంది. దీంతో కేదార్నాథుని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారు జామునుంచే క్యూ కట్టారు. ఆరు నెలల పాటు భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంది. అక్టోబర్-నవంబర్ మధ్యకాలంలో మళ్లీ ఈ ఆలయాన్ని మూసివేస్తారు. భక్తులకు ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శీతాకాలంలో ఈ ఆలయ ప్రాంతంలో విపరీతమైన మంచు కురుస్తుంది. ఈ కారణంగా ఆలయాన్ని మూసివేస్తారు. అనంతరం వేసవి ఆరంభమైన కొద్దిరోజులకు ఆలయ ద్వారాలను తెరిచి.. భక్తులకు ప్రవేశాన్ని కల్పిస్తారు. మరోవైపు బద్రీనాథ్ ఆలయం శుక్రవారం నుంచి తెరుచుకోనుంది. దీనికి సంబంధించి ఆలయ కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు.
#WATCH Uttarakhand: Portals of the Kedarnath temple open for pilgrims after a period of six months. pic.twitter.com/FN39K3LXFL
— ANI (@ANI) May 9, 2019