Pooja Hegde: 8 సంవత్సరాల తరువాత రీఎంట్రీ.. పూజాకు బంపరాఫర్..!
టాలీవుడ్, బాలీవుడ్లో వరుస సినిమాలు, విజయాలతో దూసుకుపోతోంది పూజా హెగ్డే. ఈ రెండు ఇండస్ట్రీల్లో ఈ అమ్మడికి మంచి క్రేజ్ ఏర్పడింది. అయితే హీరోయిన్గా తన కెరీర్ను పూజా మొదట తమిళ్లో ప్రారంభించిన విషయం తెలిసిందే.
టాలీవుడ్, బాలీవుడ్లో వరుస సినిమాలు, విజయాలతో దూసుకుపోతోంది పూజా హెగ్డే. ఈ రెండు ఇండస్ట్రీల్లో ఈ అమ్మడికి మంచి క్రేజ్ ఏర్పడింది. అయితే హీరోయిన్గా తన కెరీర్ను పూజా మొదట తమిళ్లో ప్రారంభించిన విషయం తెలిసిందే. మిస్కన్ తెరకెక్కించిన ముగమూడి అనే చిత్రం ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది పూజా హెగ్డే. ఇందులో జీవా సరసన పూజా నటించగా.. ఆ మూవీ ఫ్లాప్ అయ్యింది. దీంతో అక్కడ ఆమెకు అవకాశాలు కూడా రాలేదు. ఇక ఈ సినిమా తరువాత రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకున్న పూజా.. టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదట్లో ఇక్కడ కూడా ఫ్లాప్లు వచ్చినప్పటికీ.. ఆ తరువాత విజయాలు రావడంతో స్టార్ హీరోయిన్ స్టేటస్ను సంపాదించుకుంది.
ఇదంతా పక్కనపెడితే పూజాకు ఇప్పుడు కోలీవుడ్లో బంపరాఫర్ వచ్చినట్లు సమాచారం. విజయ్ హీరోగా సుధా కొంకర ఓ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు కోలీవుడ్లో వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ.. ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయట. ఇక సన్ పిక్చర్స్ నిర్మించబోతున్న ఈ చిత్రంలో హీరోయిన్గా పూజా హెగ్డేను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. కోలీవుడ్లో ఆఫర్ కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తోన్న పూజా.. ఈ అవకాశం వస్తూనే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే 8 సంవత్సరాల తరువాత కోలీవుడ్లోకి రీ ఎంట్రీ ఇవ్వనుంది పూజా. కాగా ప్రస్తుతం సుధా కొంకర, సూర్య హీరోగా సూరరై పొట్రు(తెలుగులో ఆకాశమేహద్దుగా) అనే మూవీని తెరకెక్కించింది. ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో మోహన్ బాబు కీలక పాత్రలో నటించారు. ఇప్పటికే టీజర్తో ఆకట్టుకున్న ఈ మూవీపై అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్లో మంచి అంచనాలు ఉన్నాయి.
Read This Story Also: ‘భాయ్’ సినిమాలో బుట్టబొమ్మ.. భలే ఛాన్స్ కొట్టేసిందిగా…