Rajyasabha elections: పొంగులేటికి పక్కా.. కేకేకు డౌట్..

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీలో రాజ్యసభ రేసు మొదలైంది. సీఎం కూతురు కవిత సహా పలువురు మాజీ లోక్‌సభ సభ్యులు తమ వంతు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అదే సమయంలో దళిత, గిరిజన వర్గానికి చెందిన వారు కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

Rajyasabha elections: పొంగులేటికి పక్కా.. కేకేకు డౌట్..
Follow us

|

Updated on: Feb 20, 2020 | 6:25 PM

Huge competition for Rajyasabha tickets in TRS Party: ఏపీలో రాజ్యసభ రేసు నడుస్తుంటే…..టీఆర్‌ఎస్‌లో కూడా పెద్దల సభకు వెళ్ళే నేతలపై డిస్కషన్‌ నడుస్తోంది. సామాజిక సమీకరణాలు, రాజకీయ అవసరాల దృష్టిలో పెట్టుకుని కేసీఆర్‌ ఎవరికి సీటు ఇస్తారనేది ఇంట్రెస్టింగ్‌ మారింది. మాజీ ఎంపీలకు ఈసారి చాన్స్‌ ఇస్తారని ప్రచారం నడుస్తోంది.

టీఆర్ఎస్ లో రాజ్యసభ రేసు మొదలైంది. ఈ సారి పెద్దల సభ అవకాశం ఎవరికి వస్తుందన్న దానిపై పార్టీలో చర్చ జరుగుతోంది. ఏప్రిల్ రెండో వారంలో రాజ్యసభ ఎంపీలు గరికపాటి రామ్మోహన్​రావు, కేవీపీల పదవీకాలం ముగియనుంది. ఆ రెండు సీట్లకు ఎన్నిక నిర్వహించేందుకు ఈసీ ఈ నెలాఖరులో నోటిఫికేషన్​ విడుదల చేసే చాన్స్​ ఉంది. దీంతో ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రగతి భవన్‌కు క్యూ కడుతున్నారు.

ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు కేకే పదవీ కాలం కూడా ముగుస్తోంది. దీంతో ఆయనకు రెన్యువల్‌ ఉంటుందా? లేదా? అనేది సస్పెన్స్‌ నెలకొంది. కేసీఆర్‌ బర్త్‌ డే సందర్భంగా ఆయన ప్రగతి భవన్‌కు వెళ్లి కలిశారు. మరీ ఆయనకు రెస్సాన్స్‌ ఎలా వచ్చింది? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఇక రాజ్యసభ రేసులో మాజీ ఎంపీలు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వినోద్‌ కుమార్‌, కవిత కూడా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. మొన్నటి పార్లమెంట్‌ ఎన్నికల్లో ఖమ్మం సీటు పొంగులేటికి కేసీఆర్‌ ఇవ్వలేదు. దీంతో అప్పుడే రాజ్యసభ ఇస్తానని కేసీఆర్‌ హామీ ఇచ్చారట. ఇప్పుడు టీఆర్‌ఎస్‌కు దక్కే రెండు సీట్లలో ఒకటి పొంగులేటికి గ్యారెంటీ అనే టాక్ విన్పిస్తోంది.

మాజీ ఎంపీ కవితకు రాజ్యసభ సీటు ఇవ్వాలని నిజామాబాద్​ జిల్లా నేతలు కోరుతున్నారు. లోక్​సభ ఎలక్షన్లలో ఓడిపోయినప్పటి నుంచి కవిత యాక్టివ్ పాలిటిక్స్‌కు దూరంగా ఉంటున్నారు. మున్సిపల్ ఎన్నికల టైంలోనూ జిల్లాకు వెళ్లలేదు. ఈ జిల్లా నుంచి మాజీ స్పీకర్ సురేశ్​రెడ్డి, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్​రావు రాజ్యసభ సీటుపై ఆశలు పెట్టుకున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ స్పీకర్ మధుసుదనాచారి పెద్దల సభకు వెళ్లాలని తెగ ట్రై చేస్తున్నారట. అయితే ఆయనకు చాన్స్‌ ఇస్తారా? లేదా? అనేది రాజకీయ, సామాజిక సమీకరణాలను బట్టి ఉంటుందని తెలుస్తోంది. టీఆర్ఎస్​ నుంచి ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీలకు రాజ్యసభ చాన్స్​ ఇవ్వలేదు. ప్రస్తుతం బీసీలు కేకే, బడుగు లింగయ్య యాదవ్, బండా ప్రకాశ్, డీఎస్.. ఓసీల నుంచి సంతోష్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు.

దీంతో తమకు ఈసారి అవకాశం ఇవ్వాలని ఎస్సీ, ఎస్టీ లీడర్లు కోరుతున్నారు. ఎస్సీ వర్గం నుంచి మందా జగన్నాథం, ఎస్టీల నుంచి మాజీ ఎంపీ సీతారాం నాయక్ ప్రయత్నాలు చేస్తున్నారట. వీళ్లే కాదు. ఎన్నికల్లో ఓడిపోయిన నేతలు బూర నర్సయ్య గౌడ్, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు లాంటి నేతలు కూడా రాజ్యసభ సీటు ఆశిస్తున్నారని తెలుస్తోంది. ఎన్నడూ లేని విధంగా టీఆర్‌ఎస్‌లో ఈసారి రాజ్యసభ సీటు కోసం పెద్ద ఎత్తున పోటీ నెలకొంది.

Also read: TRS leaders in the race for MLC tickets

పెట్టుబడిదారులకు సాయం చేసే నయా సిస్టమ్‌.. వారికి ఇక పండగే..!
పెట్టుబడిదారులకు సాయం చేసే నయా సిస్టమ్‌.. వారికి ఇక పండగే..!
రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు