చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు!
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ, తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి మరి కొద్ది గంటల్లో తెరపడనుండగా, ఆయా పార్టీల నేతలు తక్కువ సమయంలో ఎక్కువ చోట్ల ప్రచారానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. మంగళగిరిలో వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి తరపున జగన్ ప్రచారం నిర్వహించారు. మంగళగిరిలో జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు అరాచక పాలనపై ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని పిలుపునిచ్చారు. ఆర్కే ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటాడని, ఆయనకు ఓటేసి గెలిపించాలని కోరారు. మంగళగిరిలో ఆయనను గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని […]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ, తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి మరి కొద్ది గంటల్లో తెరపడనుండగా, ఆయా పార్టీల నేతలు తక్కువ సమయంలో ఎక్కువ చోట్ల ప్రచారానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. మంగళగిరిలో వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి తరపున జగన్ ప్రచారం నిర్వహించారు. మంగళగిరిలో జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు అరాచక పాలనపై ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని పిలుపునిచ్చారు. ఆర్కే ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటాడని, ఆయనకు ఓటేసి గెలిపించాలని కోరారు. మంగళగిరిలో ఆయనను గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు.
తమ పార్టీ అధికారంలోకి వస్తే, గుంటూరు జిల్లా నుంచి ఇచ్చే తొలి ఎమ్మెల్సీ పదవిని మంగళగిరి చేనేత వర్గానికే కేటాయిస్తానని హామీ ఇచ్చారు. ఒక్కో చేనేత కుటుంబానికి ఏడాదికి రూ. 24 వేల ఆర్థిక సాయం అందజేస్తామని అన్నారు. చంద్రబాబుకు ఓటేస్తే, రాష్ట్ర ప్రజలు మరింతగా నష్టపోతారని, అరాచకాలకు కేరాఫ్ అడ్రస్గా ఉన్న టీడీపీ సర్కారును తరిమికొట్టాలని జగన్ పిలుపునిచ్చారు. రైతులకు ఏ కష్టం వచ్చినా ఇక్కడి స్థానిక హీరో ఆర్కే ఆదుకున్నాడని, టీడీపీ ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఆయన మీ కోసమే పనిచేశారన్నారు.