వైసీపీ దెబ్బకు కేఏపాల్కు షాక్ తగిలింది: పృధ్వీ
సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. దీంతో.. ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఈ సందర్భంగా వైసీపీ నేత, నటుడు ప్రృధ్వీ మాట్లాడుతూ.. ఇంతటి ఘనవిజయం సాధించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. జగన్ పాలనపై ప్రజలకు నమ్మకం ఉందన్నారు. జగన్ ఏపీకి సీఎం కావడం ఆ రాష్ట్ర ప్రజల అదృష్టమన్నారు. పాదయాత్రతోనే జగన్ ప్రజల మనస్సుల్లోకి వెళ్లారు. రాష్ట్ర చరిత్రలో ఇంత మెజార్టీ సాధించిన పార్టీ వైసీపీనే అని […]
సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. దీంతో.. ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఈ సందర్భంగా వైసీపీ నేత, నటుడు ప్రృధ్వీ మాట్లాడుతూ.. ఇంతటి ఘనవిజయం సాధించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. జగన్ పాలనపై ప్రజలకు నమ్మకం ఉందన్నారు. జగన్ ఏపీకి సీఎం కావడం ఆ రాష్ట్ర ప్రజల అదృష్టమన్నారు. పాదయాత్రతోనే జగన్ ప్రజల మనస్సుల్లోకి వెళ్లారు. రాష్ట్ర చరిత్రలో ఇంత మెజార్టీ సాధించిన పార్టీ వైసీపీనే అని ఇది చరిత్రని పేర్కొన్నారు.
అంతేగాక తమ పార్టీని ఎగతాళి చేసిన కేఏపాల్కు చురకలంటించారు పృధ్వీ. హెలీకాఫ్టర్ గుర్తుతో వైసీపీకి ఎక్కువ ఓట్లు పడ్డాయని కేఏపాల్ అనడం కామెడీగా ఉందన్నారు. మాకు 150 సీట్లు రావడంతో కేఏపాల్ షాక్కు గురయ్యాడని పేర్కొన్నారు. అలాగే.. మేము కమేడియన్స్ కాదని.. జగన్కు అభిమానులమని తెలిపారు. లగడపాటి సర్వేపై కూడా స్పందించిన పృధ్వీ.. లగడపాటిని ‘చిలక జోష్యుడ’ని సంబోధించారు. రాబోయే రోజుల్లో ఏపీలో టీడీపీ పార్టీ గెలవలేదని.. కాంగ్రెస్కు పట్టిన గతే టీడీపీకి పడుతుందని విమర్శించారు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ.