చంద్రబాబు కష్టం పగవాడికి కూడా రావొద్దు: విజయసాయి రెడ్డి
మాజీ సీఎం కష్టం పగవాడికి కూడా రావొద్దని అన్నారు వైసీపీ నేత విజయసాయి రెడ్డి. తాజాగా.. మరోసారి చంద్రబాబుపై ఆయన విరుచుకుపడ్డారు. కరకట్టలోపల నిర్మించిన చంద్రబాబు ఇళ్లు.. కృష్ణానదిలో మునిగిపోయిందని.. ఇళ్లు విడిచి ఆయన హైదరాబాద్కు పారిపోయారని ఎద్దేవా చేశారు. అక్రమంగా ఆస్తులు సంపాదిస్తే.. ఇలానే ఉంటుందని ఆరోపించారు. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ చేస్తూ.. చంద్రబాబు కష్టం పగవాడికి కూడా రాకూడదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నది పూడిస్తే.. ఇంత అనర్థం ఉండేది కాదు […]
మాజీ సీఎం కష్టం పగవాడికి కూడా రావొద్దని అన్నారు వైసీపీ నేత విజయసాయి రెడ్డి. తాజాగా.. మరోసారి చంద్రబాబుపై ఆయన విరుచుకుపడ్డారు. కరకట్టలోపల నిర్మించిన చంద్రబాబు ఇళ్లు.. కృష్ణానదిలో మునిగిపోయిందని.. ఇళ్లు విడిచి ఆయన హైదరాబాద్కు పారిపోయారని ఎద్దేవా చేశారు. అక్రమంగా ఆస్తులు సంపాదిస్తే.. ఇలానే ఉంటుందని ఆరోపించారు. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ చేస్తూ.. చంద్రబాబు కష్టం పగవాడికి కూడా రాకూడదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నది పూడిస్తే.. ఇంత అనర్థం ఉండేది కాదు కాదా అంటూ.. చంద్రబాబుని ఉద్ధేశించి ట్వీట్లో పేర్కొన్నారు.
చంద్రబాబు గారి కష్టాలు పగవాడికి కూడా రావొద్దు. కరకట్ట లోపల నిర్మించిన ఇంటికి వరద ముప్పు ఉందని తెలియడంతో హైదరాబాద్ పారిపోయారు. ఇంటి ఆవరణలోని కార్లు, విలువైన సామాగ్రిని మరో చోటకి తరలించారు. ఇప్పుడైనా అర్థమైందా బాబు గారూ నదిని పూడిస్తే ప్రకృతి ప్రకోపం ఎలా ఉంటుందో?
— Vijayasai Reddy V (@VSReddy_MP) August 15, 2019
చంద్రబాబు అపచారాలకు ఆగ్రహించి కృష్ణమ్మ జల కొరడా ఝుళిపించింది. ఇసుక దోపిడీ, నదిని పూడ్చి దీవుల ఏర్పాటు, గెస్ట్ హౌస్ నిర్మాణం లాంటి చర్యలతో బ్యారేజిలో నీటి నిల్వను కుదించేశారు. ఉప్పొంగిన నదిని చూసి ప్రజలు సంతోషిస్తుంటే తను హైదరాబాద్లో దాక్కున్నాడు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) August 15, 2019