ఢిల్లీని సుందరంగా మారుస్తాం: అరవింద్ కేజ్రీవాల్
అందమైన, పరిశుభ్రమైన నగరంగా ఢిల్లీని మారుస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఢిల్లీలోని కంటోన్మెంట్ ప్రాంతంలో ఆయన సోమవారం పర్యటించారు. ఏడు లోక్సభ స్థానాల్లో ఏఏపీ అభ్యర్థులను గెలిపిస్తే ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్రహోదా సాధిస్తామన్నారు. ఢిల్లీలోని మూడు మున్సిపల్ కార్పోరేషన్ ప్రాంతాలను బీజేపీ పాలిస్తోందన్న ఆయన.. అక్కడ కాలుష్యం పెరిగిపోవడానికి బీజేపీ నేతలే కారణమని ఆరోపించారు. తమ పరిధిలోని పాఠశాలలు, ఆసుపత్రుల పనితీరును […]
అందమైన, పరిశుభ్రమైన నగరంగా ఢిల్లీని మారుస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఢిల్లీలోని కంటోన్మెంట్ ప్రాంతంలో ఆయన సోమవారం పర్యటించారు. ఏడు లోక్సభ స్థానాల్లో ఏఏపీ అభ్యర్థులను గెలిపిస్తే ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్రహోదా సాధిస్తామన్నారు. ఢిల్లీలోని మూడు మున్సిపల్ కార్పోరేషన్ ప్రాంతాలను బీజేపీ పాలిస్తోందన్న ఆయన.. అక్కడ కాలుష్యం పెరిగిపోవడానికి బీజేపీ నేతలే కారణమని ఆరోపించారు. తమ పరిధిలోని పాఠశాలలు, ఆసుపత్రుల పనితీరును మెరుగుపరిచామన్నారు. అదేవిధంగా ఏడు లోక్సభ స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే ఢిల్లీని అత్యంత సుందర నగరంగా తీర్చిదిద్దుతామన్నారు.