38 వేల ఫోన్ బిల్లు ఎగ్గొట్టిన వరుణ్ గాంధీ
హైదరాబాద్ : బీజేపీ నాయకుడు వరుణ్ గాంధీ.. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్కు భారీ మొత్తంలో ఫోన్ బిల్లు ఎగ్గొట్టారు. 2009-14 మధ్య కాలంలో వరుణ్ గాంధీ ఫిలిబిత్ ఎంపీగా ఉన్న సమయంలో అక్కడ ఏర్పాటు చేసిన నియోజకవర్గ ఆఫీసుకు ఒక ఫోన్ను సమకూర్చారు. ఐదేళ్ల కాలానికి ఈ ఫోన్ బిల్లు రూ. 38,616 అయింది. అయితే ఈ బిల్లు కట్టకుండానే, బీఎస్ఎన్ఎల్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోకుండానే వరుణ్ గాంధీ ఫిలిబిత్ నుంచి […]
హైదరాబాద్ : బీజేపీ నాయకుడు వరుణ్ గాంధీ.. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్కు భారీ మొత్తంలో ఫోన్ బిల్లు ఎగ్గొట్టారు. 2009-14 మధ్య కాలంలో వరుణ్ గాంధీ ఫిలిబిత్ ఎంపీగా ఉన్న సమయంలో అక్కడ ఏర్పాటు చేసిన నియోజకవర్గ ఆఫీసుకు ఒక ఫోన్ను సమకూర్చారు. ఐదేళ్ల కాలానికి ఈ ఫోన్ బిల్లు రూ. 38,616 అయింది. అయితే ఈ బిల్లు కట్టకుండానే, బీఎస్ఎన్ఎల్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోకుండానే వరుణ్ గాంధీ ఫిలిబిత్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. రూ. 38,616ల ఫోన్ బిల్లు చెల్లించకుండా ఫిలిబిత్ లోక్సభ నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేసిన వరుణ్ గాంధీపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారికి బీఎస్ఎన్ఎల్ ఫిర్యాదు చేసింది. నాయకుల ఈ తరహా చర్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ వరుణ్ గాంధీపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసింది. అయితే ఎన్నికల్లో పోటీ చేయదలచుకున్న అభ్యర్థులందరూ.. ప్రభుత్వ సంస్థల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకుని నామినేషన్ పత్రాలకు జతపర్చాలి. ఒక వేళ అభ్యర్థి ఈ నియమాలు పాటించకపోతే ఆ నామినేషన్ తిరస్కరించబడుతుంది. ఫిలిబిత్ నియోజకవర్గ పరిధిలో ఏప్రిల్ 23న ఎన్నికలు జరగనున్నాయి.