జగన్‌పై వంగవీటి రాధా ఫైర్

విజయవాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌పై వంగవీటి రాధాకృష్ణ ఫైరయ్యారు. వైసీపీ నుంచి తాను బయటకు వచ్చానని కొంత మంది భావిస్తున్నారని, ఒకరకంగా మెడ పట్టుకొని బయటకు గెంటేశారని చెప్పారు. గతంలో తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన తనను, సెంట్రల్ నియోజకవర్గానికి వెళ్లమని జగన్ చెప్పారు. జగన్ చెప్పిన వైపే వెళ్లి పని మొదలు పెట్టాక, చివరి నిమిషంలో అర్ధం లేని కారణాలతో బయటకు వెళ్లిపోయేలా చేశారని రాధా ఆరోపించారు. జగన్‌కు డబ్బు […]

జగన్‌పై వంగవీటి రాధా ఫైర్
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 06, 2019 | 8:26 PM

విజయవాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌పై వంగవీటి రాధాకృష్ణ ఫైరయ్యారు. వైసీపీ నుంచి తాను బయటకు వచ్చానని కొంత మంది భావిస్తున్నారని, ఒకరకంగా మెడ పట్టుకొని బయటకు గెంటేశారని చెప్పారు. గతంలో తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన తనను, సెంట్రల్ నియోజకవర్గానికి వెళ్లమని జగన్ చెప్పారు. జగన్ చెప్పిన వైపే వెళ్లి పని మొదలు పెట్టాక, చివరి నిమిషంలో అర్ధం లేని కారణాలతో బయటకు వెళ్లిపోయేలా చేశారని రాధా ఆరోపించారు. జగన్‌కు డబ్బు లేదా కులం మాత్రమే కావాలన్నారు. డబ్బు లేకపోతే కాస్ట్ ఉండాలని విమర్శించారు.