పీసీసీ ఛీఫ్గా ఉత్తమ్ : కుంతియా క్లారిటీ
టీ.పీసీసీ ఛీఫ్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనసాగుతారని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి కుంతియా ప్రకటించారు. ఉత్తమ్ను ఆ పదవి నుంచి తొలగించాలని, కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేస్తోన్న డిమాండ్ను ఆయన తోసి పుచ్చారు. రాజగోపాల్ రెడ్డికి పార్టీ ఎంతో గౌరవం ఇచ్చిందని, అయితే ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయని కుంతియా పేర్కొన్నారు. రాజగోపాల్ రెడ్డిపై క్రమశిక్షణా సంఘం చర్యలు తీసుకుంటుందని అన్నారు. పార్టీ నాయకత్వం బలహీనంగా ఉందన్న విషయం.. […]
టీ.పీసీసీ ఛీఫ్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనసాగుతారని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి కుంతియా ప్రకటించారు. ఉత్తమ్ను ఆ పదవి నుంచి తొలగించాలని, కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేస్తోన్న డిమాండ్ను ఆయన తోసి పుచ్చారు. రాజగోపాల్ రెడ్డికి పార్టీ ఎంతో గౌరవం ఇచ్చిందని, అయితే ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయని కుంతియా పేర్కొన్నారు. రాజగోపాల్ రెడ్డిపై క్రమశిక్షణా సంఘం చర్యలు తీసుకుంటుందని అన్నారు. పార్టీ నాయకత్వం బలహీనంగా ఉందన్న విషయం.. టికెట్ల కోసం వచ్చినప్పుడు తెలియదా..? అని ఆయన ప్రశ్నించారు. ఈ నెల 29న నాగార్జున సాగర్లో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుందని, రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్షునిగా కొనసాగాలని కుంతియా తెలిపారు.