CM YOGI: యూపీ రాజకీయాల్లో అబ్బాజాన్ రచ్చ.. ఇద్దరు ఎస్పీ ఎమ్మెల్యేలపై కేసు..
యూపీ రాజకీయాల్లో అబ్బాజాన్ రచ్చ కొనసాగుతోంది. తాజాగా ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తండ్రిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ రాజ్పాల్ కశ్యప్తో సహా ఇద్దరు సమాజ్వాదీ పార్టీ నేతలపై..
యూపీ రాజకీయాల్లో అబ్బాజాన్ రచ్చ కొనసాగుతోంది. తాజాగా ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తండ్రిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ రాజ్పాల్ కశ్యప్తో సహా ఇద్దరు సమాజ్వాదీ పార్టీ నేతలపై కేసు నమోదైంది. ఎస్పి వెనుకబడిన తరగతుల సెల్ ప్రెసిడెంట్గా ఉన్న శ్రీ కశ్యప్తో పాటు, పార్టీ ఫిలిబిట్ జిల్లా యూనిట్ ప్రెసిడెంట్ యూసుఫ్ ఖాద్రి పేరును FIRనమోదు చేసినట్లుగా స్థానిక ఎస్పీ దినేష్ కుమార్ తెలిపారు.
బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మహాదేవ్ ఫిర్యాదు మేరకు సుంగరి కొత్వాలి పోలీస్ స్టేషనల్లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ముఖ్యమంత్రి యోగి చేసిన ‘అబ్బా జాన్’ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ పిలిభిత్లో జరిగిన వెనుకబడిన తరగతుల సమావేశంలో యోగి తండ్రిపై శ్రీ కశ్యప్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.
యోగి ఆదిత్యనాథ్ ‘అబ్బా జాన్’ అంటూ చేసిన వ్యాఖ్యలపై పెను దుమారం రేగుతోంది. కన్న తండ్రిని ముస్లిమ్లు ప్రేమగా పిలుచుకొనే ‘అబ్బాజాన్’ అనే ఉర్దూ సంబోధనతో మైనారిటీలను ఆయన అన్యాపదేశంగా ప్రస్తావించారు. మునుపటి ఏలుబడిలో మెజారిటీల ఉచిత రేషన్ను కూడా ‘అబ్బా జాన్’ అనేవాళ్ళే తినేశారంటూ యోగి ఆదివారం ఓ కార్యక్రమంలో అన్నారు. గత పాలనలో రేషనంతా నేపాల్, బంగ్లాదేశ్లకు తరలిపోయిందంటూ, పరోక్షంగా మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, ఆయన తండ్రి ములాయమ్లపై నోరు చేసుకున్నారు. ఇక, మంగళవారం అలీగఢ్లో ప్రధానమంత్రి మోదీ ఏకపక్షంగా యోగీది ‘ఉత్తమ పాలన’ అని సమర్థించారు. మునుపటి మాఫియారాజ్యం యూపీలో ఇప్పుడు లేదంటూ ప్రతిపక్షాలపై తూటాలు పేల్చారు. ఈ తాజా సభలు, వ్యాఖ్యలతో వచ్చే మార్చిలో రానున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల యుద్ధానికి బీజేపీ ముందే సమరశంఖం పూరించింది. మరోపక్క ‘ద్వేషాన్ని పెంచిపోషించేవారు యోగి ఎలా అవుతార’న్న రాహుల్ తదితరుల ప్రతిస్పందనలతో రాజకీయం వేడెక్కుతోంది.
ముఖ్యమంత్రికి తాను భయపడనని పేర్కొన్నారు కశ్యప్. తన పార్టీ నాయకుడు ములాయం సింగ్ యాదవ్పై ఆదిత్యనాథ్ ఏదైనా ప్రకటన చేస్తే తాను మౌనంగా ఉండబోనని కూడా హెచ్చరించారు. పోలీసుల చెప్పిన కథనం ప్రకారం.. పార్టీ కార్యక్రమానికి హాజరయ్యే వ్యక్తులు కూడా కోవిడ్ ప్రోటోకాల్ను ఉల్లంఘించారని దీనికి సంబంధించి కూడా కేసు నమోదైందని పోలీసులు తెలిపారు.
ఇటీవల సమాజ్వాదీ పార్టీపై స్పష్టమైన దాడిలో ఆదిత్యనాథ్ కుషినగర్లో ‘అబ్బా జాన్’ అని చెప్పే వ్యక్తులు ఇంతకు ముందు అన్ని రేషన్లను జీర్ణం చేసుకునేవారని చెప్పారు.